News June 19, 2024

ఏలూరు: టేకు చెక్కపై రామాయణం

image

చింతలపూడికి చెందిన మందగుల కనకలింగ వీరబ్రహ్మం తన చేతికళతో టేకుచెక్కపై అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు. ఎలక్ట్రీషియన్‌గా పనిచేసిన ఆయన 2001లో పాత యర్రవర్రపు శేషయ్య స్ఫూర్తితో తలుపులపై దేవుడి బొమ్మలు చెక్కడం, సిమెంట్‌ దిమ్మెలపై శిల్పాలు చెక్కడంలో ఆరితేరారు. ఈ క్రమంలోనే తాజాగా రామాయణంలోని పాత్రలు, విశిష్ఠతలను 2 అడుగుల మందం గల టేకుచెక్కపై 3 నెలల సమయంలో చెక్కాడు. ఈ కళ అందరినీ ఆకట్టుకుంటోంది.

Similar News

News September 14, 2025

వరి రైతుకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి: జేసీ

image

వరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి వ్యాపారులను ఆదేశించారు. ఆదివారం ఆయన కడియద్దలో పర్యటించి, వరి కోతలను పరిశీలించారు. అనంతరం రైతులు, ట్రేడర్లతో మాట్లాడి పంట ధర గురించి ఆరా తీశారు. అంతకుముందు ఉల్లిపాయల మార్కెట్‌లో ఉల్లి ధరలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, తహశీల్దార్ పాల్గొన్నారు.

News September 13, 2025

మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత: ప.గో కలెక్టర్

image

జిల్లాలో మహిళల ఆరోగ్య పరిరక్షణకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం భీమవారంలోని కలెక్టరేట్‌లో మాట్లాడారు. ‘స్వస్థ నారి – శసక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు, వైద్య నిపుణుల సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.

News September 13, 2025

పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు

image

జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణపై రూపొందించిన అవగాహన పోస్టర్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా ఉచిత టీకాలు వేస్తారని ఆమె తెలిపారు. జిల్లాలోని పశువుల యజమానులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.