News June 19, 2024
రామోజీరావుకు వైఎస్ షర్మిల నివాళులు

AP: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ దివంగత రామోజీరావుకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా నివాళులర్పించారు. ఈరోజు ఆర్ఎఫ్సీకి చేరుకున్న ఆమె, ఆయన ఫొటోకు అంజలి ఘటించారు. ఆయన కుటుంబీకుల్ని పరామర్శించి సానుభూతిని తెలియజేశారు. గతంలో వైఎస్ కుటుంబం, రామోజీరావు మధ్య పలు విభేదాలుండేవన్న సంగతి తెలిసిందే.
Similar News
News March 28, 2026
రాత్రి ఫోన్ చేసి ఇన్నర్వేర్పై ప్రొఫెసర్ ప్రశ్నలు!

చెన్నైలోని అన్నా వర్సిటీ ప్రొఫెసర్ జ్ఞానవేల్పై ఒక విద్యార్థిని సంచలన ఫిర్యాదు చేశారు. ఇంటర్న్షిప్ ఇప్పిస్తానని దగ్గరై తనను వేధించాడని బాధితురాలు ఆరోపించారు. రాత్రి వేళల్లో ఫోన్ చేసి ఇన్నర్వేర్, పీరియడ్స్, పెళ్లి వంటి పర్సనల్ విషయాలపై అసభ్యంగా మాట్లాడుతూ టార్చర్ పెట్టేవాడని తెలిపారు. నంబర్ బ్లాక్ చేసినా ఇతర మార్గాల్లో వేధించాడని పేర్కొన్నారు. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
News March 28, 2026
వారిని అన్ఫాలో చేసిన రిషబ్.. శాండల్వుడ్లో కలకలం

‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి వ్యవహారం శాండల్వుడ్లో చర్చనీయాంశమవుతోంది. డైరెక్టర్, నటుడు రాజ్ బీ శెట్టి, హీరోయిన్ రుక్మిణీ వసంత్, నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ను ఆయన ఇన్స్టాలో అన్ఫాలో చేయడం కలకలం రేపింది. వారితో విభేదాలతోనే ఇలా చేశారని టాక్ నడుస్తోంది. దీనిపై ఎవరూ స్పందించలేదు. రాజ్తో కల్ట్ క్లాసిక్ ‘గరుడ గమన వృషభ వాహన’, రుక్మిణీతో కాంతార: చాప్టర్1 చిత్రాల్లో రిషబ్ నటించారు.
News March 28, 2026
‘చికెన్పాక్స్’ జీవితంలో ఒక్కసారే ఎందుకు వస్తుంది?

మనకు జ్వరాలు, ఇన్ఫెక్షన్లు అనేకసార్లు వస్తాయి. కానీ చికెన్పాక్స్(ఆటలమ్మ/అమ్మవారు) ఓసారి వస్తే మళ్లీ రాదు. దీనికి కారణాలు తెలుసుకుందాం. వెరిసెల్లా జోస్టర్ వైరస్ వల్ల ఈ అంటువ్యాధి వస్తుంది. తీవ్రమైన దురద, దద్దుర్లు, జ్వరం, అలసట దీని లక్షణాలు. 5-7 రోజులకు తగ్గుతుంది. ఈ వ్యాధి సోకగానే శరీరం ఉత్పత్తి చేసే యాంటీబాడీలు జీవితకాల రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. మళ్లీ వైరస్ సోకినా వెంటనే అంతం చేస్తాయి.


