News June 19, 2024
అశోక్ గజపతిరాజుతో రామ్మోహన్ నాయుడు భేటీ

కేంద్ర మాజీమంత్రి పి.అశోక్ గజపతి రాజును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖలో ఉన్న అశోక్ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. మంచి మంత్రిత్వ శాఖ ఇచ్చారని బాగా పనిచేసి పేరు తీసుకురావాలని రామ్మోహన్ నాయుడును కోరారు. విమానయాన రంగంపై అశోక్ తన అనుభవాలను వివరించారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా అశోక్ను కలిశారు.
Similar News
News March 2, 2026
VZM: కలెక్టరేట్లో నేడు PGRS కార్యక్రమం

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News March 2, 2026
VZM: ‘జనావాసాల్లో ఉంచితే కేసులు నమోదు చేస్తాం’

బాణసంచా నిల్వ, తయారీ, విక్రయదారులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డిఎస్పీ ఆర్.గోవిందరావు సూచించారు. విజయనగరం వన్ టౌన్ పోలీసు స్టేషన్లో హోల్సేల్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. అనుమతులు లేకుండా విక్రయాలు చేయవద్దని, షాపులు-గోడౌన్ల వద్ద ఫైర్ సేఫ్టీ చర్యలు, ఫైర్ అలారమ్స్, సురక్షిత వైరింగ్ ఏర్పాటు చేయాలన్నారు. జనావాసాల్లో నిల్వ ఉంచితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
News March 1, 2026
విజయనగరంలో పోలీసుల ర్యాలీ

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరం కోట జంక్షన్ నుంచి మూడు లాంతర్ల వరకు పోలీసులు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని, వారి రక్షణకు పోలీసుశాఖ కట్టుబడి ఉందని డీఎస్పీ గోవిందరావు పేర్కొన్నారు. ఆపద సమయంలో సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ‘శక్తి’ యాప్ను ప్రతీ మహిళ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.


