News June 19, 2024
షాద్నగర్కు జూపార్క్ తరలింపు..?

HYD నెహ్రూ జూలాజికల్ పార్క్ షాద్నగర్కు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. జూపార్కు పరిసరాల్లో వాయు, శబ్ద కాలుష్యం ఎక్కువ అవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసినప్పుడు జూపార్కు సమీపంలోని మీర్ ఆలం ట్యాంక్ నుంచి వరద ఉద్ధృతి పెరిగి జూపార్కులోకి నీరు ప్రవేశిస్తుండటంతో జూపార్కును మరో చోటికి తరలించాలన్న ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
Similar News
News January 1, 2026
HYD: మెట్రోపై సర్కార్ స్టడీ.. టెక్నికల్ కమిటీల ఏర్పాటు

HYD మెట్రో సర్కారు చేతుల్లోకి రానున్న దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైల్ నిర్వహణ ఎలా ఉండాలనే విషయంపై అధికారులు సమాలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో మెట్రో రైల్ను స్టడీ (అధ్యయనం) చేసేందుకు 2 టెక్నికల్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ (ఇన్ఛార్జి) సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఈ కమిటీలు మెట్రోను పరిశీలించి త్వరలో నివేదిక సమర్పిస్తాయన్నారు.
News January 1, 2026
HYDలో కొత్త జిల్లా.. త్వరలో ఉత్తర్వులు?

రాజధానికి 4 కమిషనరేట్లను తీసుకొచ్చిన ప్రభుత్వం తాజాగా కొత్త జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కమిషనరేట్ల సరిహద్దులకు సమానంగా సిటీ పరిధిలోని 3 జిల్లాలను 4కు పెంచేలా CM ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. RRను ఫ్యూచర్ సిటీతో రూరల్ జిల్లాగా, అర్బన్ ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయనుంది. HYDజిల్లాలోని కంటోన్మెంట్ ఏరియాను మల్కాజిగిరిలో కలిపి, శంషాబాద్, రాజేందర్నగర్ను HYDలో కలపనుందట.
News January 1, 2026
HYDలో బిర్యానీ తిని ఒకరి మృతి.. 15మంది సీరియస్

న్యూ ఇయర్ వేడుక విషాదం మిగిల్చింది. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట PS పరిధిలోని భవానినగర్లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగి బిర్యానీ తిన్నవారు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు (53) మృతి చెందగా మరో 15 మంది సూరారంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


