News June 19, 2024

ఢిల్లీలో మండుతున్న ఎండలు

image

దేశ రాజధాని ఢిల్లీలో ఎండలతో పాటు వడగాలులు ప్రజలను వణికిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. వారం రోజులుగా ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఎండ వేడికి తాళలేక ఇవాళ ఐదుగురు వడదెబ్బతో మరణించారు. పదుల సంఖ్యలో ICUలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు యూపీ, హరియాణా, పంజాబ్, ఉత్తరాఖండ్, బిహార్, ఝార్ఖండ్‌లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Similar News

News October 8, 2024

అందరి చూపు జమ్మూకశ్మీర్ పైనే..

image

దాదాపు పదేళ్ల తర్వాత ఎన్నికలు జరగడంతో దేశం మొత్తం చూపు జమ్మూకశ్మీర్ వైపే ఉంది. ఇవాళ ఫలితాల నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనని అంతా ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ హంగ్ ఏర్పడవచ్చని చెప్పినా తమదే విజయమని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో హంగ్ ఏర్పడితే గవర్నర్ నామినేట్ చేసే ఐదుగురు ఎమ్మెల్యేలు కీలకం కానున్నారు. దీంతో బీజేపీకి లాభమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News October 8, 2024

ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్

image

TG: కేంద్రం అందిస్తోన్న ‘నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్’కు ఇంటర్ పాసైన విద్యార్థులు ఈనెల 31 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. అలాగే గతంలో అప్లై చేసుకున్నవారు ఇదే గడువులోగా రెన్యువల్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఏడాది టాప్-20 పర్సంటైల్ వచ్చిన విద్యార్థులు 59,355 మంది ఉన్నారని తెలిపింది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ <>వెబ్‌సైట్‌<<>>ను సందర్శించండి.

News October 8, 2024

నేడే రిజల్ట్స్: గెలుపెవరిదో?

image

హరియాణా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఇప్పటికే ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎగ్జిట్ పోల్స్ దాదాపు కాంగ్రెస్‌ కూటమికే అనుకూలంగా రాగా బీజేపీ మాత్రం గెలుపుపై ధీమాగా ఉంది. దీంతో ఫలితాలపై మరింత ఆసక్తి నెలకొంది.