News June 19, 2024

స్మృతి మంధాన అరుదైన ఘనత

image

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించారు. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా స్మృతి (7) నిలిచారు. ఈ క్రమంలో మిథాలీ రాజ్ (7) రికార్డును ఆమె సమం చేశారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచులో ఈ ఫీట్ అందుకున్నారు. మిథాలీ ఈ ఫీట్‌ను 211 ఇన్నింగ్స్‌ల్లో అందుకోగా, స్మృతి 84 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించడం విశేషం.

Similar News

News January 2, 2026

విశాఖ ఏజెన్సీలో లాభాలు అందిస్తున్న స్ట్రాబెర్రీ సాగు

image

విశాఖ జిల్లా లంబసింగి పరిధిలో స్ట్రాబెర్రీ సాగు జోరందుకుంది. మంచి లాభాలు వస్తుండటంతో ఎక్కువ మంది రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. పుణె నుంచి మొక్కలు తెచ్చి నాటుతుండగా, ఏప్రిల్ చివరి వరకు దిగుబడి ఉంటుంది. ఎకరా సాగుకు రూ.3 లక్షల వరకు ఖర్చవుతోంది. ఇక్కడకు వచ్చే టూరిస్టులకు కాయలు, స్ట్రాబెర్రీ జామ్, స్ట్రాబెర్రీ చీజ్ కేక్, జూస్ రూపంలో విక్రయిస్తూ పెంపకందారులు మంచి ఆదాయం పొందుతున్నారు.

News January 2, 2026

పేరెంట్స్ వాట్సాప్‌కు ఇంటర్ స్టూడెంట్స్ హాల్‌టికెట్లు

image

TG: హాల్‌టికెట్లను విద్యార్థుల పేరెంట్స్‌ వాట్సాప్‌కు పంపాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఫిబ్రవరి 25 నుంచి ఎగ్జామ్స్ జరగనుండగా 45 రోజుల ముందే వాట్సాప్‌కు లింక్ పంపుతామని, దీంతో వాటిలో తప్పులేమైనా ఉంటే గుర్తించే వీలుంటుందని పేర్కొంది. ఫస్టియర్ స్టూడెంట్స్ తమ SSC రోల్ నంబర్, DOB.. సెకండియర్ విద్యార్థులు ఫస్టియర్ హాల్‌టికెట్ నంబర్, DOB ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది.

News January 2, 2026

లొంగిపోయిన దేవా

image

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కీలక నేత బర్సే దేవా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మరో 15 మంది మావోలతో కలిసి ఆయన సరెండర్ అయ్యారు. దేవాపై రూ.50లక్షల రివార్డ్ ఉంది. ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన అగ్రనేత హిడ్మాతో కలిసి దేవా 15 ఏళ్లు పనిచేశారు. వీరిద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు.