News June 19, 2024

సిరికొండ: బడికెళ్లాలంటే 1.5 కి.మీ నడవాల్సిందే

image

సిరికొండ మండలం సాత్ మెారి గ్రామానికి చెందిన విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే కాలినడకన 1.5 కి.మీ నడిచి బోరింగూడకు వెళ్లాల్సి వస్తోందని గ్రామస్థులు వాపోయారు. మండలంలోని సూర్యగూడ, రాంజీగూడ, బోరింగూడ గ్రామాలకు బస్ సౌకర్యం లేదని, కొన్నిసార్లు ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉండక పోవడంతో విద్యార్థులకు కాలినడక తప్పడం లేదన్నారు. అధికారులు స్పందించి బస్ ఏర్పాటు చేయాలని కోరారు.

Similar News

News March 14, 2026

ఆదిలాబాద్‌లో పది పరీక్షకు 23 మంది గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిసాయి. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా శనివారం నిర్వహించిన పరీక్షకు 10887 మంది విద్యార్థులకు గాను 10864 విద్యార్థులు హాజరై 23 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 33 పరీక్ష కేంద్రాలను ఆయా జిల్లా అధికారులు విస్తృతంగా సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు.

News March 14, 2026

భూభారతి పనులను వేగవంతం చేయాలి: ADB కలెక్టర్

image

ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి పనులను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి పథకాల అమలుపై శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

News March 14, 2026

భూభారతి పనులను వేగవంతం చేయాలి: ADB కలెక్టర్

image

ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి పనులను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి పథకాల అమలుపై శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.