News June 19, 2024
పేలవ ఫలితాలపై కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీలు

పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి పేలవ ఫలితాలు వచ్చిన రాష్ట్రాల్లో నిజ నిర్ధారణ కమిటీలను కాంగ్రెస్ ప్రకటించింది. మొత్తం 8 రాష్ట్రాల్లో కమిటీలు నియమించింది. ఇందులో కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఉన్నాయి. కురియన్, రకిబుల్ హుస్సేన్, పర్గత్ సింగ్ తెలంగాణలో ఓటమికి గల కారణాలు తేల్చనున్నారు.
Similar News
News February 2, 2026
పోలీసులే దగ్గరుండి దాడులు చేయిస్తారా: బొత్స

AP: మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై TDP దాడులు దారుణమని YCP నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ‘రాష్ట్రానికి మంచి పేరుండేది. దాడులతో దాన్ని చెడగొట్టి చంద్రబాబు అప్రదిష్ఠ తెస్తూ బిహార్లా మారుస్తున్నారు. మరే పార్టీకీ కార్యకర్తలు లేరనుకుంటున్నారా? ఇది సంప్రదాయం కాదు. పోలీసులు దగ్గరుండి దాడులు చేయిస్తారా? DGP ఏం చేస్తున్నారు? ప్రభుత్వ తీరును ప్రజలు గమనించాలి’ అని బొత్స కోరారు.
News February 2, 2026
117 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News February 2, 2026
మోమోల కోసం రూ.85లక్షల విలువైన గోల్డ్ ఇచ్చేశాడు

మోమోలపై ఉన్న ఇష్టంతో ఉత్తరప్రదేశ్లో 7వ తరగతి బాలుడు రూ.85 లక్షల విలువైన బంగారు ఆభరణాలను మోసగాళ్లకు ఇచ్చేశాడు. మోమో స్టాల్ నడుపుతున్న ముగ్గురు వ్యక్తులు తన కుమారుడిని మోసం చేశారని బాలుడి తండ్రి విమలేశ్ మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి నగలు తెస్తే, ఉచితంగా మోమో ఇస్తామని స్టాల్ యజమానులు చెప్పడంతో ఆ బాలుడు ఆభరణాలిచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


