News June 20, 2024
కాకినాడ: జాతీయ రహదారిపై ఆందోళన కలిగిస్తున్న ప్రమాదాలు

కాకినాడ జిల్లా జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాల్లోని జాతీయ రహదారిపై ఇటీవల ప్రమాదాల సంఖ్య భారీగా పెరగటం స్థానికులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఈ మూడు మండలాల్లో జనవరి నుంచి ఇంత వరకు 39 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వాటిలో 17 మంది మృత్యువాత పడ్డారు. 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాలకు అతివేగం ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. దీనికి తోడు అధికారుల అలసత్వం కూడా ఒక కారణమని చెబుతున్నారు.
Similar News
News January 12, 2026
తూ.గో: ఇనుపరాడ్తో కొట్టి భార్యను హతమార్చిన భర్త

కుటుంబ కలహాలు ఓ మహిళ ప్రాణాన్ని బలిగొన్నాయి. రాజమండ్రి రూరల్(M) కొంతమూరులోని బూసమ్మకాలనీకి చెందిన కన్నారామకృష్ణ శనివారం అర్ధరాత్రి భార్య పద్మ(36)తో గొడవపడి, పదునైన ఇనుపరాడ్తో దాడి చేసి కిరాతకంగా హతమార్చాడు. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ వీరయ్యగౌడ్ వెల్లడించారు.
News January 12, 2026
తూ.గో: నేడు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు

తూ.గో జిల్లాలోని కలెక్టరేట్లో ప్రతి సోమవారం PGRS కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. నేడు భూమి సంబంధిత సమస్యల తక్షణ పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అధికారులు పలు రెవెన్యూ రికార్డులతో ఈ ప్రోగ్రామ్కు హాజరుకావాలన్నారు.
News January 12, 2026
తూ.గో: నేడు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు

తూ.గో జిల్లాలోని కలెక్టరేట్లో ప్రతి సోమవారం PGRS కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. నేడు భూమి సంబంధిత సమస్యల తక్షణ పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అధికారులు పలు రెవెన్యూ రికార్డులతో ఈ ప్రోగ్రామ్కు హాజరుకావాలన్నారు.


