News June 20, 2024
బాధ్యతలు చేపట్టిన మంత్రులు
AP: సచివాలయంలో మంత్రులు బాధ్యతలు చేపట్టారు. జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు, కార్మికశాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్, పరిశ్రమల శాఖ మంత్రిగా TG భరత్ తమ ఛాంబర్లలో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి పోలవరాన్ని పరుగులు పెట్టిస్తామని నిమ్మల అన్నారు. YCP వల్లే పోలవరం ఆలస్యమైందని దుయ్యబట్టారు. కార్మిక చట్టాలను జగన్ ప్రభుత్వం కాలరాసిందని వాసంశెట్టి ఫైర్ అయ్యారు.
Similar News
News February 4, 2025
రూ.5,447 కోట్ల బకాయిలు పెట్టిన వైసీపీ ప్రభుత్వం: టీడీపీ
AP: మార్చి 12న వైసీపీ తలపెట్టిన ‘ఫీజు పోరు’పై టీడీపీ Xలో ఫైరయ్యింది. గత ప్రభుత్వం రీయింబర్స్మెంట్, చిక్కీలు, కోడిగుడ్లు, వసతి దీవెన కింద ₹5,447 కోట్ల బకాయిలు పెట్టిందని ఆరోపించింది. YS జగన్ విద్యార్థులు, వారి పేరెంట్స్ను మానసిక క్షోభకు గురి చేస్తే లోకేశ్ ₹800 కోట్లు విడుదల చేసి మనోధైర్యాన్ని నింపారని పేర్కొంది. YCP నేతలు ‘ఫీజు పోరు’ కలెక్టరేట్ల ముందు కాకుండా జగన్ యలహంక ప్యాలెస్ ముందు చేయాలంది.
News February 4, 2025
English Learning: Antonyms
✒ Guile× Honesty, frankness
✒ Grudge× Benevolence, Affection
✒ Genuine× Spurious
✒ Generosity× Stinginess, greed
✒ Glory× Shame, Disgrace
✒ Gloomy× Gay, Bright
✒ Harass× Assist, comfort
✒ Hamper× Promote, facilitate
✒ Hazard× Conviction, security
News February 4, 2025
‘భారత రత్న’ ఎక్కడ తయారు చేస్తారో తెలుసా?
దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన కొద్ది మందినే ఈ అవార్డు వరిస్తుంది. ఇప్పటివరకు 54 మందికి మాత్రమే ఈ అవార్డునిచ్చారు. అయితే, భారతరత్న పతకాన్ని స్వచ్ఛమైన రాగితో తయారుచేస్తారు. ఇది ఆకు ఆకారంలో, మధ్యలో వెండి రంగులో సూర్యుడి ఆకారపు అంచుతో ఉంటుంది. దీనిని ప్రత్యేకంగా కోల్కతాలోని భారత ప్రభుత్వ మింట్లో రూపొందిస్తారు. ఇక్కడే ఇతర అవార్డులనూ తయారుచేస్తారు.