News June 20, 2024
వేడి కారణంగా ఢిల్లీలో 192మంది నిరాశ్రయుల మృతి

ఉత్తరాదిలో నిన్న మొన్నటి వరకు వేడిగాలుల ఉధృతి కొనసాగింది. ఆ కారణంగా ఢిల్లీలో ఈ నెల 11 నుంచి 19 మధ్యలో 192మంది నిరాశ్రయులు మృతిచెందారని ఎన్జీవో సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ సంస్థ తెలిపింది. ఈ కాల పరిమితిలో ఇంతమంది చనిపోవడం ఇదే అత్యధికమని ఓ నివేదికలో వెల్లడించింది. ఢిల్లీలో గడచిన 72 గంటల్లో ఐదుగురు కన్నుమూయడం గమనార్హం. ఇక గత 24 గంటల్లోనే నోయిడాలో 14మంది వేడి కారణంగా చనిపోయారు.
Similar News
News January 8, 2026
అమరావతికి చట్టబద్ధత సాధ్యమేనా?

AP: రాష్ట్రాలు తమ రాజధానులను మార్చడం లేదా కొత్త రాష్ట్రం ఏర్పాటు వేళ రాజధానికి చట్టబద్ధత అవసరం. ఈ అధికారం పార్లమెంటుకు ఉంటుంది. పునర్విభజనతో రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. దీంతో అమరావతికి చట్టబద్ధత కల్పించాలని తాజాగా అమిత్ షాను CM CBN కోరారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదించి, పార్లమెంటులో ప్రవేశపెడితే చట్టబద్ధత లభిస్తుంది. తర్వాత కొత్త రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ గెజిట్ విడుదలవుతుంది.
News January 8, 2026
IREDAలో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ రెనెవెబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (<
News January 8, 2026
పూజ గదిలో ఉండకూడని దేవుళ్ల చిత్రపటాలు

పూజ గదిలో ఉగ్రరూపంలో ఉన్న విగ్రహాలు, చిత్రపటాలు ఉండకూడదు. ఉదాహరణకు.. కాళికాదేవి, మహిషాసుర మర్దిని వంటి రౌద్ర రూపాలు గృహస్థులకు మంచిది కావని శాస్త్రం చెబుతోంది. అలాగే మరణించిన పితృదేవతల ఫొటోలను పూజ గదిలో దేవుడి పటాల మధ్య ఉంచకూడదు. వాటిని దక్షిణ దిశలో వేరుగా ఉంచాలి. ప్రశాంతమైన, ఆశీర్వదించే భంగిమలో ఉన్న దైవ చిత్రాలను మాత్రమే పూజకు ఉపయోగించాలి. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని పండితులు చెబుతారు.


