News June 20, 2024
NEETపై సీబీఐతో విచారణ జరిపించాలి: మంత్రి శ్రీధర్ బాబు
TG: పరీక్షల నిర్వహణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ‘నీట్ పరీక్షకు సంబంధించి అవకతవకలపై కేంద్రం స్పందించాలి. 63 మందికి ఒకటే ర్యాంక్ వచ్చింది. విద్యార్థులకు అన్యాయం జరగొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున డిమాండ్ చేస్తున్నాం. సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతున్నాం’ అని తెలిపారు.
Similar News
News October 8, 2024
బాలికపై అత్యాచారం.. స్పందించిన పవన్
AP: పిఠాపురంలో <<14301232>>మైనర్<<>> బాలికపై జరిగిన అఘాయిత్యం తనకు బాధ కలిగించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారని, లేదంటే తప్పించుకునేవాడని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించానన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
News October 8, 2024
త్వరలో గ్రామబాట కార్యక్రమం: పెద్దిరెడ్డి
AP: వైసీపీ ఆధ్వర్యంలో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ బాట కార్యక్రమం చేపడతామని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులతో తిరుపతిలో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం శ్రమిస్తున్న వారికి పదవులు ఇస్తామని తెలిపారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు సమావేశానికి హాజరయ్యారు.
News October 8, 2024
తాజ్మహల్ అందం.. మాటల్లో చెప్పలేం: ముయిజ్జు
భారత పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తాజాగా తాజ్మహల్ను సతీసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆ కట్టడం అందానికి ముగ్ధుడయ్యారు. ‘ఈ సమాధి మందిర అందాన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యం. ప్రేమకు, నిర్మాణ నైపుణ్య పరాకాష్ఠకు ఇది సజీవ సాక్ష్యం’ అని విజిటర్ బుక్లో రాశారు. భారత్లో 4 రోజుల టూర్లో భాగంగా ఆయన నేడు ముంబై, రేపు బెంగళూరులో పర్యటించనున్నారు.