News June 20, 2024
భారత్ సంపద 1000% పెరుగుతుంది: NSE MD

భారత్ సంపద మరో 50ఏళ్లలో 10రెట్లు (1000%) పెరుగుతుందని NSE ఎండీ ఆశీష్ కుమార్ అంచనా వేశారు. యువత ద్వారా భారత్ గణనీయ వృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సర్వీస్ సెక్టార్ భారత్ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అయితే పేదరికం, నిరక్షరాస్యత, ఆహార కొరత, పౌష్టికాహార లోపం, పారిశుద్ధ్యం, రవాణాకు సంబంధించి దేశం ఇంకా సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు.
Similar News
News March 13, 2026
‘రామాయణంలో పిడకల వేట’ అంటే?

ముఖ్య విషయాన్ని వదిలేసి పనికిరాని వాటి గురించి మాట్లాడే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. పండితులు రామాయణం చెబుతుండగా ఓ మహిళ ఇంటి దగ్గర పిడకలు ఏమయ్యాయోనని మధ్యలో అనడంతో ‘రామాయణంలో పిడకల వేట’ వాడుకలోకి వచ్చింది. అలాగే రామాయణంలో ‘త్రిపిటికా:’ అని ఉంది. బౌద్ధ గ్రంథాలనూ ‘త్రిపిటికా’ అంటారు. దీంతో బౌద్ధం తర్వాత రామాయణం వచ్చిందని వాదించే వాళ్ల గురించి చెబుతూ ఈ జాతీయం వచ్చిందని నమ్మకం.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 13, 2026
మూడో రోజూ బ్లడ్బాత్.. భారీ నష్టాలు

యుద్ధ భయాలు, గ్యాస్ కొరత నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ భారీగా నష్టపోయాయి. నిఫ్టీ ఏకంగా 488(2.06) పాయింట్లు కోల్పోయి 23,151 వద్ద, సెన్సెక్స్ 1,470(1.93) పాయింట్లు నష్టపోయి 74,563 వద్ద ముగిశాయి. నిఫ్టీ మూడు రోజుల్లో సుమారు 1,100 పాయింట్లు కోల్పోవడం గమనార్హం. L&T(7.38%), టాటా స్టీల్(5.3%), ఎస్బీఐ(3.7%), బెల్(3%), మారుతి(3%) షేర్లు భారీగా నష్టపోయాయి.
News March 13, 2026
ఆ పథకంతో 17 వేల మందికి ఉపాధి: మంత్రి

AP: ‘సీఎం ఉపాధి సృష్టి’ పథకం ద్వారా ₹300Crతో 3,500 సూక్ష్మ పరిశ్రమలకు ఆర్థికసాయం చేయాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. దీని ద్వారా 17 వేల మందికి ఉపాధి లభించనుందన్నారు. ఇక APSP బెటాలియన్లలో 300 హెడ్ కానిస్టేబుల్స్ పోస్టుల్ని అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులుగా అప్గ్రేడ్ చేసేందుకు, నీరుకొండలో తెలుగు కల్చరల్ సెంటర్కు ₹119.27Cr మంజూరుకు ప్రతిపాదించామన్నారు.


