News June 20, 2024

పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

image

AP: ఈవీఎం ధ్వంసం సహా పలు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. పిన్నెల్లికి అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల గడువును పొడిగించారు. తీర్పు వెలువడే వరకు ఇవి అమల్లో ఉంటాయని తెలిపారు.

Similar News

News February 4, 2025

నేడు రథసప్తమి.. ఇలా స్నానం చేయండి

image

ఈ ఏడాది మాఘ శుద్ధ సప్తమి ఇవాళ ఉ.7.53 నుంచి రేపు ఉ.5.30 వరకు ఉంది. నేడు ఉ.8 నుంచి మ.12 వరకు సూర్య భగవానుడి పూజకు మంచి సమయం. ఆదిత్యుడికి జిల్లేడు పత్రాలంటే ప్రీతి. ఉదయాన్నే రెండు భుజాలు, శిరస్సుపైన మూడు చొప్పున జిల్లేడు ఆకులను, వాటిపై కొద్దిగా బియ్యం ఉంచి స్నానం చేస్తే ఆరోగ్యం చేకూరుతుందని నమ్మకం. సూర్య కిరణాలు ప్రసరించే చోట రథం ముగ్గు వేసి భగవానుని పూజించాలి. పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి.

News February 4, 2025

EAPCET.. ప్రతి అభ్యంతరానికి రూ.500

image

TG: <<15348696>>ఈఏసీసెట్‌కు<<>> సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. పరీక్ష తర్వాత విడుదల చేసే కీలో అభ్యంతరాలు లెవనెత్తాలంటే విద్యార్థులు ఒక్కో ప్రశ్నకు రూ.500 చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చారు. వారి అబ్షక్షన్ సరైనదని తేలితే ఆ మొత్తాన్ని తిరిగిస్తారు. హేతుబద్ధత లేకుండా వందల సంఖ్యలో అభ్యంతరాలు వస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో ఫ్రీగానే అబ్షక్షన్‌ను వ్యక్తపరిచే అవకాశం ఉండేది.

News February 4, 2025

ఈ నెలలోనే గ్రూప్స్ ఫలితాలు?

image

TG: గ్రూప్-1తో సహా గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల ఫలితాలను ఈనెలాఖరులోగా విడుదల చేసేందుకు TGPSC కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా <<15352858>>గ్రూప్-1<<>> జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేసి, తర్వాత గ్రూప్-2, గ్రూప్-3 రిజల్ట్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇలా చేయడం వల్ల గ్రూప్-1 జాబ్ వచ్చిన వాళ్లు మిగతా రెండింటికి ఎంపికైనా వదులుకుంటారు. దీంతో బ్యాక్‌లాగ్ పోస్టులు మిగిలే ఛాన్స్ ఉండదని అధికారులు భావిస్తున్నారు.