News June 20, 2024

నెల రోజుల్లో ఆర్టీసీ ఉచిత ప్రయాణం: మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి

image

AP: మరో నెల రోజుల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు చెప్పారు. ‘వైసీపీ హయాంలో ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదు. ఉన్న బస్సులనే యథావిధిగా కొనసాగించారు. ఆర్టీసీ మనుగడ కాపాడేందుకు కృషి చేస్తా. ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికులను కాపాడుకునే బాధ్యత మాపై ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News February 4, 2025

రథ సప్తమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

image

రథ సప్తమి రోజున తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీకాకుళంలోని అరసవిల్లిలోని సూర్యభగవానుడిని దర్శించుకునేందుకు ఉదయాన్నే భక్తులు పోటెత్తారు. మరోవైపు తిరుమలలో రథసప్తమి వేడుకలను టీటీడీ ప్రారంభించింది. సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధుల్లో మలయప్ప స్వామి ఊరేగింపు సాగుతోంది. యాదాద్రిలోనూ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వచ్చారు.

News February 4, 2025

నేడు రథసప్తమి.. ఇలా స్నానం చేయండి

image

ఈ ఏడాది మాఘ శుద్ధ సప్తమి ఇవాళ ఉ.7.53 నుంచి రేపు ఉ.5.30 వరకు ఉంది. నేడు ఉ.8 నుంచి మ.12 వరకు సూర్య భగవానుడి పూజకు మంచి సమయం. ఆదిత్యుడికి జిల్లేడు పత్రాలంటే ప్రీతి. ఉదయాన్నే రెండు భుజాలు, శిరస్సుపైన మూడు చొప్పున జిల్లేడు ఆకులను, వాటిపై కొద్దిగా బియ్యం ఉంచి స్నానం చేస్తే ఆరోగ్యం చేకూరుతుందని నమ్మకం. సూర్య కిరణాలు ప్రసరించే చోట రథం ముగ్గు వేసి భగవానుని పూజించాలి. పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి.

News February 4, 2025

EAPCET.. ప్రతి అభ్యంతరానికి రూ.500

image

TG: <<15348696>>ఈఏసీసెట్‌కు<<>> సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. పరీక్ష తర్వాత విడుదల చేసే కీలో అభ్యంతరాలు లెవనెత్తాలంటే విద్యార్థులు ఒక్కో ప్రశ్నకు రూ.500 చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చారు. వారి అబ్షక్షన్ సరైనదని తేలితే ఆ మొత్తాన్ని తిరిగిస్తారు. హేతుబద్ధత లేకుండా వందల సంఖ్యలో అభ్యంతరాలు వస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో ఫ్రీగానే అబ్షక్షన్‌ను వ్యక్తపరిచే అవకాశం ఉండేది.