News June 20, 2024

T20WC: అఫ్గాన్‌తో మ్యాచ్‌.. సిరాజ్‌పై వేటు?

image

టీ20 వరల్డ్ కప్‌ సూపర్ 8లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌పై వేటు పడనున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో చైనామన్ కుల్దీప్ యాదవ్‌కు చోటివ్వాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. మ్యాచ్ జరిగే కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశాలు ఉండటంతో ఈ మార్పు చేయనున్నట్లు టాక్. కాగా ఈ మెగా టోర్నీలో కుల్దీప్ ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

Similar News

News February 6, 2026

సంపూర్ణ ఆహారం గొర్రెల పెరుగుదలకు ముఖ్యం

image

గొర్రెలకు మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు, విటమిన్లతో కూడిన సంపూర్ణ దాణా(ఆహారం) అందేలా జాగ్రత్త వహించాలి. అప్పుడే గొర్రె మందలు ఆరోగ్యంగా పెరుగుతాయి. మంచి దాణా వల్ల గొర్రెల్లో పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి వాటి మందలు వృద్ధిచెంది, పెంపకందారులకు అధిక ఆదాయం అందిస్తాయి. సరైన పోషకాహారం అందని తల్లి గొర్రెల వద్ద పిల్లలకు సరిపోను పాలుండకపోతే పిల్లలు సరిగా ఎదగక మరణిస్తాయి.

News February 6, 2026

పురుషాంగం సైజు పెంచుకుంటున్నట్లు ప్లేయర్లపై ఆరోపణలు

image

వింటర్ ఒలింపిక్స్ కోసం కొందరు స్కీ జంపర్స్ పురుషాంగం సైజు పెంచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. స్కీయర్స్‌కు శరీరం తాకి ఉండే టైట్ సూట్స్ కుట్టేందుకు 3D బాడీ స్కాన్ చేస్తారు. కొంచెం గ్యాప్ ఉన్నా గాలి చేరి తేలికై ఎక్కువ జంప్ చేయొచ్చు. దీంతో పెద్ద సూట్‌కై కొందరు ప్లేయర్స్ ఇంజెక్షన్లతో తాత్కాలికంగా సైజు పెంచుతున్నారని జర్మన్ మీడియా ఆరోపణ.

News February 6, 2026

‘సిగాచీ’ బాధితులకు రూ.కోటి ఇప్పిస్తే రాజీనామా చేస్తా: హరీశ్ రావు

image

TG: సిగాచీ ప్రమాద బాధితులకు CM రేవంత్ ₹కోటి చొప్పున పరిహారం ఇప్పిస్తే MLA పదవికి రాజీనామా చేస్తానని హరీశ్ రావు ప్రకటించారు. ‘సిగాచీ ప్రమాదంలో 54 మంది చనిపోతే ఎవరూ పట్టించుకోలేదు. CM ₹కోటి పరిహారం ప్రకటించి ఒక్క రూపాయి ఇవ్వలేదు. KCR ఇచ్చిన పథకాలన్నీ బంద్ చేశాడు. పేగులు తీసి మెడలో వేసుకుంటా, గుడ్లు పీకి గోలీలాడుతా అంటాడు. ఇదేనా CM మాట్లాడే భాష?’ అని సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఫైరయ్యారు.