News June 20, 2024
ఆఫీసుకు లేటైతే రూ.200 ఫైన్.. రూ.1000 చెల్లించిన ఫౌండర్
ముంబై ఆధారిత ఓ బ్యూటీ బ్రాండ్ వ్యవస్థాపకుడు తీసుకున్న నిర్ణయం అతన్నే ఫైన్ కట్టేలా చేసింది. కంపెనీ ఉత్పాదకతను పెంచేందుకు కఠినమైన నియమాన్ని ఆయన ప్రవేశపెట్టారు. సిబ్బంది 9.30 గంటల్లోపు ఆఫీస్కు రావాలని, లేకపోతే రూ.200 ఫైన్ వేస్తామని తెలిపారు. అయితే, ఈ నియమం పాటించడంలో అతను విఫలమయ్యాడు. పది రోజుల్లో 5 సార్లు లేటుగా రావడంతో రూ.వెయ్యి ఫైన్ చెల్లించినట్లు అతడు Xలో పేర్కొన్నాడు.
Similar News
News February 4, 2025
రథ సప్తమి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
రథ సప్తమి రోజున తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీకాకుళంలోని అరసవిల్లిలోని సూర్యభగవానుడిని దర్శించుకునేందుకు ఉదయాన్నే భక్తులు పోటెత్తారు. మరోవైపు తిరుమలలో రథసప్తమి వేడుకలను టీటీడీ ప్రారంభించింది. సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధుల్లో మలయప్ప స్వామి ఊరేగింపు సాగుతోంది. యాదాద్రిలోనూ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వచ్చారు.
News February 4, 2025
నేడు రథసప్తమి.. ఇలా స్నానం చేయండి
ఈ ఏడాది మాఘ శుద్ధ సప్తమి ఇవాళ ఉ.7.53 నుంచి రేపు ఉ.5.30 వరకు ఉంది. నేడు ఉ.8 నుంచి మ.12 వరకు సూర్య భగవానుడి పూజకు మంచి సమయం. ఆదిత్యుడికి జిల్లేడు పత్రాలంటే ప్రీతి. ఉదయాన్నే రెండు భుజాలు, శిరస్సుపైన మూడు చొప్పున జిల్లేడు ఆకులను, వాటిపై కొద్దిగా బియ్యం ఉంచి స్నానం చేస్తే ఆరోగ్యం చేకూరుతుందని నమ్మకం. సూర్య కిరణాలు ప్రసరించే చోట రథం ముగ్గు వేసి భగవానుని పూజించాలి. పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
News February 4, 2025
EAPCET.. ప్రతి అభ్యంతరానికి రూ.500
TG: <<15348696>>ఈఏసీసెట్కు<<>> సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. పరీక్ష తర్వాత విడుదల చేసే కీలో అభ్యంతరాలు లెవనెత్తాలంటే విద్యార్థులు ఒక్కో ప్రశ్నకు రూ.500 చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చారు. వారి అబ్షక్షన్ సరైనదని తేలితే ఆ మొత్తాన్ని తిరిగిస్తారు. హేతుబద్ధత లేకుండా వందల సంఖ్యలో అభ్యంతరాలు వస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో ఫ్రీగానే అబ్షక్షన్ను వ్యక్తపరిచే అవకాశం ఉండేది.