News June 21, 2024

ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి పైనుంచి దూకి సూసైడ్

image

ప్రొద్దుటూరు శ్రీనివాసనగర్ కు చెందిన చాంద్ బాషా (54) జిల్లా ఆసుపత్రి భవనం పైనుంచి బుధవారం అర్ధరాత్రి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చాంద్ బాషా టీబీ వ్యాధికి జిల్లా ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ఇంటికి వెళ్లాడు. తిరిగి 2 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. బుధవారం అర్ధరాత్రి జిల్లా ఆసుపత్రి 2వ అంతస్తు భవనంపై నుంచి దూకాడు. సిబ్బంది అతనికి వైద్యం అందిస్తుండగా చనిపోయాడు.

Similar News

News January 31, 2026

కలసపాడు: పంచాయతీ కార్యదర్శి గ్రూప్-2కు ఎంపిక

image

కలసపాడు మండలంలో పలు పంచాయతీలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన లక్ష్మీ సృజన ఇటీవల విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్‌గా ఎంపిక అయ్యారు. కలసపాడు మండలంలోని పలు పంచాయతీల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సృజన పనితీరు, మంచితనం ప్రజలను గౌరవించడం ఆమె కృషికి ఈ ఎంపిక సంతోషకరమని పలువురు ప్రజలు అభినందించారు.

News January 30, 2026

కడప: అక్రిడిటేషన్ల జారీకి ఆమోదం.!

image

కడప జిల్లాలోని అర్హులైన 569 మంది జర్నలిస్టులకు తొలి విడతలో అక్రిడిటేషన్లు మంజూరు చేస్తూ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఆమోదం తెలిపిందని DMAC ఛైర్మన్, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది. అర్హులైన జర్నలిస్టులందరికీ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్లు మంజూరు చేశామని, మొదటి సమావేశంలో 569కి కమిటీ ఆమోదం తెలిపిందన్నారు.

News January 30, 2026

ఫిబ్రవరి 1న పార్నపల్లెకు రానున్న గౌతమ్ ఆదాని

image

లింగాల(M) పార్నపల్లె గ్రామ సమీపంలోని చిత్రావతి డ్యాం వద్ద నిర్మాణంలో ఉన్న ఆదాని పవర్ ప్లాంట్‌ను ఫిబ్రవరి 1న పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదాని సందర్శించనున్నారు. డ్యాంలోని నీటిని రివర్స్ పంపింగ్ చేయడంవల్ల విద్యుత్తును తయారు చేసే విధంగా ఈ ప్లాంట్‌ను రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా డ్యామ్ వద్ద ఉన్న హెలిప్యాడ్‌ను డీఎస్పీ మురళి నాయక్, అధికారులు పరిశీలించారు.