News June 21, 2024

తూ.గో.: ‘500 మార్కుల కంటే ఎక్కువ వస్తే బహుమతి’

image

ఉమ్మడి తూ.గో జిల్లాలో ఈ ఏడాది టెన్త్ పరీక్ష ఫలితాల్లో 500 మార్కులు పైగా వచ్చిన భట్రాజు సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు రూ.2 వేల నగదు ప్రోత్సాహక బహుమతి, జ్ఞాపిక అందిస్తామని తూ.గో జిల్లా భట్రాజు సంక్షేమ సంఘం అధ్యక్షుడు లోలభట్టు శ్రీనివాసరాజు రాజమండ్రిలో గురువారం తెలిపారు. మార్కుల జాబితా, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్‌తో ఈ నెలాఖరులోగా 94935 47944 నంబర్‌కు వివరాలు పంపాలని సూచించారు.

Similar News

News January 11, 2026

పెరవలి: ఆ రోజులే మళ్లీ రప్పించాయి

image

పెరవలి మండలంలోని కానూరు శ్రీ అక్కిన చంద్రయ్య జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2005-2006 టెన్త్‌ బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 20 ఏళ్లకు తరువాత కలుసుకుని అప్పటి మధుర జ్ఞాపకాలను నేమరువేసుకున్నారు. చదువు చెప్పిన ఆనాటి గురువులను ఘనంగా సన్మానించారు.

News January 11, 2026

ఖేలో ఇండియాలో ఏపీకి రజతం.. దేవరపల్లి క్రీడాకారుల ప్రతిభ!

image

గుజరాత్‌లోని డామన్ అండ్ డయ్యూలో జరిగిన రెండవ ఖేలో ఇండియా గేమ్స్‌లో ఏపీ సెపక్ తక్రా జట్టు రెండోస్థానం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో ఒక్క పాయింట్ తేడాతో బీహార్‌పై ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఏపీ జట్టులో ప్రతిభచాటిన దేవరపల్లి క్రీడాకారులు లక్కా గణపతి, పాటంశెట్టి సాయిలను సొసైటీ ఛైర్మన్ ఉప్పులూరు రామారావు, హరికృష్ణ ప్రత్యేకంగా అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

News January 11, 2026

రాజమండ్రి: ఈ నెల 13నుంచి జిల్లా స్థాయి సంప్రదాయ క్రీడా పోటీలు

image

సంక్రాంతి పండగను పురస్కరించుకుని జిల్లా స్థాయి సంప్రదాయ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా సాధికార అధికారి డీఎమ్‌ఎమ్ శేషగిరి నేడు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల్లో సాంస్కృతిక వారసత్వంపై అవగాహనతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.ఈ పోటీలు 13వ తేదీ నుంచి ఎస్.కె.వి.టి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరగనున్నాయన్నారు.