News June 21, 2024
UPDATE.. HYD: విద్యుత్ షాక్ తగిలి విద్యార్థి మృతి

విద్యుత్ షాక్ తగిలి ఓ ఇంటర్ <<13480534>>ఫస్టియర్ విద్యార్థి<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. కోహెడ మండలంలోని ఓ కళాశాలలో గిరీశ్ కుమార్ అనే విద్యార్థి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. తనకు హాస్టల్లో ఉండటం ఇష్టం లేక గోడ దూకి పారిపోదామనుకున్నాడు. ఈ క్రమంలో గోడపై ఉన్న విద్యుత్ తీగలు తగిలి గిరీశ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News December 29, 2025
HYD: మీ పిల్లలు మాంజా వాడుతున్నారా? జర జాగ్రత్త!

చైనా మాంజాతో పాటు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వివిధ రకాల మాంజాలతో ప్రమాదం పొంచి ఉంది. మాంజా ఎదుటివారికే కాదు పతంగి ఎగరేసే కుటుంబసభ్యులకూ డేంజర్ డేంజర్ అని గుర్తించాలి. కీసరలో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి మాంజాతో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కొందరు వ్యాపారులు సంక్రాంతికి నిషేధిత మాంజా అమ్ముతున్నారు. అందరూ బాధ్యతగా భావించి ప్రమాదపు దారాలు అమ్మితే దగ్గరలోని PSలో సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
News December 28, 2025
HYD: ఐటీ హబ్లో Monday Blues!

IT కారిడార్లలో ఇప్పుడు ‘మండే బ్లూస్’ సరికొత్త రూపం దాల్చాయి. సండే నైట్ నుంచే సాఫ్ట్వేర్ ఇంజినీర్లను ‘సోమవారం భయం’ వెంటాడుతోంది. ‘బేర్ మినిమమ్ మండే’ పేరుతో కేవలం లాగిన్ అయ్యామనిపించడం, మీటింగ్లో కెమెరాలు ఆపేయడం, అత్యవసరమైతే తప్ప పని ముట్టుకోకపోవడం ఫ్యాషన్గా మారింది. కార్పొరేట్ కొలువుల్లో ఈ సోమరితనం మానసిక ప్రశాంతతా? లేక బాధ్యతారాహిత్యమా? అన్న చర్చ మొదలైంది. ఈ ‘మండే సిండ్రోమ్’ మీ ఆఫీసులోనూ ఉందా?
News December 28, 2025
న్యూ ఇయర్ నుంచే నుమాయిష్

నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నుమాయిష్ న్యూ ఇయర్ రోజే ప్రారంభం కానుంది. 85వ ఎడిషన్ JAN 1 నుంచి FEB 15 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరగనుంది. ముఖ్య అతిథిలుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై ప్రారంభిస్తారు. ఈ సారి ఎగ్జిబిషన్లో 1050 స్టాళ్లు ఉంటాయి. 4PM నుంచి 10:30PM వరకు తెరిచి ఉంటుంది. ఎంట్రీ టికెట్ ధర రూ.50గా నిర్ణయించారు. 5 ఏళ్ల లోపు పిల్లలకు FREE.


