News June 21, 2024
మద్యంపై సీబీఐ విచారణ జరిపించండి: పురందీశ్వరి

ఏపీలో మద్యం కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని BJP స్టేట్ చీఫ్ పురందీశ్వరి సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. సింథటిక్ కెమికల్స్, ఇతర హానికర రసాయనాలతో తయారుచేసిన లిక్కర్ వల్ల లివర్, కిడ్నీలు తీవ్రంగా దెబ్బతింటాయని తెలిపారు. ఈ ప్రమాదకరమైన మద్యం వల్ల గత ఐదేళ్లలో 5 లక్షల మంది మరణించి ఉండొచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన మద్యం సరఫరా చేయాలని, వైన్ షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ తీసుకురావాలని కోరారు.
Similar News
News November 6, 2025
శుభ సమయం (06-11-2025) గురువారం

✒ తిథి: బహుళ పాడ్యమి సా.4.51 వరకు
✒ నక్షత్రం: భరణి ఉ.8.35 వరకు
✒ శుభ సమయాలు: లేవు
✒ రాహుకాలం: మ.1.30-3.00
✒ యమగండం: ఉ.6.00-ఉ.7.30
✒ దుర్ముహూర్తం: ఉ.10.00-10.48, మ.2.48-3.36
✒ వర్జ్యం: రా.7.49-9.19
✒ అమృత ఘడియలు: ఉ.5.20 నుంచి మొదలు
News November 6, 2025
TODAY HEADLINES

➭ తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
➭ KTR.. రాజీనామాకు సిద్ధంగా ఉండు: CM రేవంత్
➭ 3 ఫీట్ల రేవంత్ 30 ఫీట్లున్నట్టు బిల్డప్ ఇస్తాడు: KTR
➭ APలోని 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ACB తనిఖీలు
➭ కొత్తగా 8 జిల్లాల ఏర్పాటుకు సూచనలు: మంత్రి అనగాని
➭ ఆకాశంలో కనువిందు చేసిన సూపర్ మూన్
➭ PM మోదీతో ఉమెన్స్ WC విన్నింగ్ టీమ్ భేటీ
➭ SA టెస్ట్ సిరీస్కు భారత జట్టు ప్రకటన.. పంత్ రీఎంట్రీ
News November 6, 2025
ప్రభుత్వ వర్సిటీల్లో యూనిఫైడ్ యాక్ట్: లోకేశ్

AP: ఉన్నత విద్య పాఠ్యప్రణాళికను ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఉన్నత, ఇంటర్ విద్యపై అధికారులతో ఆయన సమీక్షించారు. ‘ప్రభుత్వ వర్సిటీల్లో పరిపాలనకు సంబంధించి యూనిఫైడ్ యాక్ట్ రూపొందించాలని ఆదేశించాను. ITIలు, వర్సిటీలను NOVలోగా పరిశ్రమలతో అనుసంధానించాలి. విద్యార్థుల 100% క్యాంపస్ సెలక్షన్స్కు చర్యలు తీసుకోవాలి. ఇంటర్లో ఉత్తీర్ణత పెంపునకు చర్యలు చేపట్టాలి’ అని తెలిపారు.


