News June 21, 2024

పీఎస్‌యూ స్టాక్స్ జోరు.. 10 సెషన్లలో ₹7లక్షల కోట్ల లాభం

image

ఎన్నికల ఫలితాల తర్వాత స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొన్నా ఆ ప్రభావం ప్రభుత్వ రంగ సంస్థల స్టాక్స్‌పై పెద్దగా కనిపించలేదు. జూన్ 4-19 మధ్య 10 ట్రేడింగ్ సెషన్లలో ఈ PSU స్టాక్స్ ₹7,23,823 కోట్ల లాభాన్ని ఆర్జించాయి. దీంతో BSEలోని 56 PSU స్టాక్స్ సంపద ₹68,03,059 కోట్లకు చేరింది. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉందని ఇన్వెస్టర్లలో నమ్మకం, NDA పాలసీల కొనసాగింపు ఇందుకు కారణాలని విశ్లేషకులు చెబుతున్నారు.

Similar News

News February 4, 2025

రూ.3 కోట్లతో గర్ల్‌ఫ్రెండ్‌కు ఇల్లు కట్టించిన దొంగ

image

షోలాపూర్‌కు చెందిన ఓ దొంగ తన గర్ల్ ఫ్రెండ్‌కు రూ.3 కోట్లు వెచ్చించి ఇల్లు నిర్మించాడు. పంచాక్షరి స్వామి(37) మైనర్‌గా ఉన్నప్పటి నుంచే దొంగతనాలు చేస్తున్నాడు. ఇళ్లలో బంగారం దొంగిలించి వాటిని కరిగించి బిస్కెట్లుగా మారుస్తాడు. ఈక్రమంలో నటితో పరిచయం చేసుకుని దగ్గరయ్యాడు. దొంగిలించిన డబ్బుతో కోల్‌కతాలో రూ.3 కోట్లు వెచ్చించి ఇల్లు నిర్మించాడు. ఓ కేసులో బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయగా ఈ విషయం వెల్లడైంది.

News February 4, 2025

వన్డే జట్టులోకి మిస్టరీ స్పిన్నర్

image

ఇంగ్లండ్‌తో ఈ నెల 6న ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని BCCI సెలక్ట్ చేసింది. 15మందితో జట్టును ఇప్పటికే ప్రకటించగా 16వ ప్లేయర్ యాడ్ అయ్యారు. ఇటీవల ముగిసిన T20 సిరీస్‌లో వరుణ్ 7.66RRతో 14 వికెట్లు తీశారు. ఫామ్‌లో ఉన్న వరుణ్‌ ఈ సిరీస్‌‌లో రాణిస్తే CTకి సైతం ఎంపిక చేయాలని BCCI భావిస్తోంది. చక్రవర్తిని CTకి ఎంపిక చేయాలని సీనియర్ ప్లేయర్లు సూచించిన విషయం తెలిసిందే.

News February 4, 2025

తొలిసారి గ్రామానికి శుద్ధ తాగునీరు!

image

స్వతంత్రం వచ్చి 78 ఏళ్లవుతున్నా ఇంకా కొన్ని గ్రామాలు తాగునీరు దొరక్క అల్లాడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని చుంచునా గ్రామ ప్రజలు ఎట్టకేలకు శుద్ధమైన తాగునీటిని పొందారు. దాదాపు 100 కుటుంబాలున్న ఈ మారుమూల ప్రాంతం చుట్టూ అడవులు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఇన్నేళ్లు ఈ సమస్యను తీర్చలేకపోయారు. జల్ జీవన్ మిషన్ కింద అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవడంతో స్వచ్ఛమైన నీరు వారి చెంతకు చేరాయి.

error: Content is protected !!