News June 21, 2024

సిరిసిల్ల: ప్రగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలి: కలెక్టర్

image

రహదారులు, భవనాలశాఖ ఆధ్వర్యంలో ప్రగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం రహదారులు భవనశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి పెండింగ్‌లో ఉన్న పనుల పురోగతిపై చర్చించారు. వర్షాకాలం నేపథ్యంలో రాకపోకలకు అంతరాయం కలగకుండా క్షేత్రస్థాయిలో ఎక్కడైనా మరమ్మతుల అవసరముంటే వెంటనే చేపట్టాలన్నారు.

Similar News

News September 15, 2025

కరీంనగర్: 24/7 తాగునీరు రావట్లే..!

image

ప్రజారోగ్య శాఖ అధికారుల అలసత్వంతో కరీంనగర్ పట్టణ ప్రజలకు 24/7 తాగునీరు అందడం లేదు. ఎల్ఎండీలో 23 టీఎంసీల నీరున్నా తాగునీటి సరఫరా ఎందుకు చేయడం లేదని నగరవాసులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మూడు రోజులకు ఒకసారి గంట మాత్రమే మంచినీటి సరఫరా జరుగుతోంది. పట్టణంలో 13వేల నల్లా కనెక్షన్లు ఉండగా 60వేల మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంటుంది. అమృత్- 2 పథకంలో భాగంగా పట్టణమంతటా పైప్‌లైన్ల నిర్మాణం పూర్తయింది.

News September 14, 2025

కరీంనగర్ పీఏసీఎస్ లో 12.6 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ

image

కరీంనగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శనివారం జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో 12.6 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు డిఏఓ తెలిపారు. రైతులు అవసరానికి మించి యూరియా వాడోద్దన్నారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. జిల్లాకు అవసరమైన యూరియా తెప్పించి పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

News September 14, 2025

KNR: సహకార సంఘాలకు పర్సన్ ఇన్ చార్జీల నియామకం

image

KNR జిల్లాలోని 30 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పర్సన్ ఇన్ఛార్జీలను నియమిస్తూ జిల్లా సహకార అధికారి ఎస్.రామానుజాచార్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 30 సంఘాలకు గాను, 27 సంఘాలకు పాత PIC లనే కొనసాగిస్తూ, ఊటూర్, ఆర్నకొండ, గట్టుదుద్దెనపల్లి సంఘాల పదవీకాలాన్ని తిరిగి పొడిగించకుండా, వారిస్థానంలో సహకార శాఖ అధికారులను పర్సన్ ఇన్ చార్జీలను నియమించారు.