News June 22, 2024
మహానందిని వదలని చిరుతపులి.. స్పందించని అటవీ శాఖ అధికారులు
మహానంది పుణ్యక్షేత్రంలోని పార్వతిపురం టోల్గేట్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. చిరుత సంచారంతో భక్తులు, గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. మరోసారి చిరుత సంచారంతో ఆ మార్గంలో నడిచే భక్తులు, స్థానికులు భయపడుతున్నారు. వారం రోజులుగా చిరుత పులి మహానందిలో సంచరిస్తోందని, టోల్గేట్ సమీపంలో చిరుత పులి రోడ్డు దాటుతుండగా చూశామని అక్కడి స్థానికులు తెలిపారు.
Similar News
News October 5, 2024
కృష్ణగిరిలో 48.2 మి.మీ వర్షం
కర్నూలు జిల్లాలో వర్షం దంచికొట్టింది. కృష్ణగిరిలో అత్యధికంగా 48.2 మి.మీ వర్షం కురిసింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 25 మండలాల్లో వాన పడింది. జిల్లాలో సగటున 12.6 మి.మీ వర్షం నమోదైంది. అత్యల్పంగా ఎమ్మిగనూరులో 2.4, చిప్పగిరి 2.0, హాలహర్విలో 1.0 మి.మీ వర్షం కురిసింది. భారీ వర్షంతో ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వివిధ పంట దిగుబడులు తడిచిపోయాయి. నేడు మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించారు.
News October 5, 2024
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు నేడు సెలవు
ఆదోనిలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం సెలవు ప్రకటించినట్లు మార్కెట్ యార్డు సెక్రటరీ రామ్మోహన్రెడ్డి తెలిపారు. ఇవాళ ఎలాంటి క్రయ, విక్రయాలు జరగవన్నారు. రెండ్రోజులుగా వర్షం కురుస్తుండగా తుఫాను ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నిన్న కురిసిన వర్షానికి మార్కెట్కు తెచ్చిన వివిధ పంట దిగుబడులు తడిచిపోయాయని తెలిపారు.
News October 5, 2024
స్వర్ణాంధ్ర@2047 జిల్లా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం: కలెక్టర్
స్వర్ణాంధ్ర @2047 ప్రణాళికలో భాగంగా రాబోయే 23 సంవత్సరాలలో నంద్యాల జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించే దిశగా ప్రణాళిక రచన సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో స్వర్ణాంధ్ర @2047 జిల్లా దార్శనిక పత్ర ప్రణాళికపై అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ రంగాల స్టేక్ హోల్డర్స్లతో జిల్ల స్థాయి సమీక్ష నిర్వహించారు.