News June 22, 2024

తూ.గో.: టీడీపీ నేత కన్నుమూత

image

తూ.గో. జిల్లా సీతానగరం మండలం మిర్తిపాడుకు చెందిన గ్రామ తెలుగు యువత అధ్యక్షుడు లగడ్డ భాస్కర చౌదరి(33) శుక్రవారం మృతిచెందారు. కాగా ఈయన కొంతకాలం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈయనకు చంద్రబాబును సీఎంగా అసెంబ్లీలో చూడాలన్నది కల అని కుటుంబీకులు చెప్పారు. ఎన్నికల సమయంలో టీడీపీ విజయం కోసం అహర్నిశలు పనిచేశాడు. అసెంబ్లీ సమావేశాలు చూసేందుకు నిన్న ఆసుపత్రిలో ఆయన గదిలో టీవీ సైతం ఏర్పాటుచేశారు.

Similar News

News November 9, 2025

సబ్సిడీ వాహనాలకు దరఖాస్తుల ఆహ్వానం: ఈడీ

image

తూ.గో జిల్లాలోని సఫాయి కర్మచారి నిరుద్యోగ యువతకు NSKFDC పథకంలో భాగంగా సబ్సిడీపై సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు మంజూరు చేస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె.సత్యవతి తెలిపారు. అర్హులైన వారు కాకినాడలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. మరిన్ని వివరాలకు 62818-17023 నంబరును సంప్రదించాలని ఆమె సూచించారు.

News November 9, 2025

తుఫాన్ నష్టం అంచనాకు 10న కేంద్ర బృందం

image

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు ఈనెల 10, 11 తేదీల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమిబసు నేతృత్వంలోని 8 మంది సభ్యుల బృందం, నష్టం, పునరావాస చర్యలపై కేంద్రానికి నివేదిక ఇస్తుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు.

News November 8, 2025

తాళ్లపూడి: యాసిడ్ పడి ఇద్దరికి గాయాలు

image

తాళ్లపూడి మండలం పైడిమెట్టలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గోతులమయమైన రహదారిపై వెళ్తున్న యాసిడ్ ట్యాంకర్ నుంచి కుదుపులకు యాసిడ్ లీకైంది. అది ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిపై పడటంతో వారికి గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.