News June 22, 2024
అనంత: తొలిసారి అసెంబ్లీలోకి 8మంది ఎమ్మెల్యేలు
జిల్లాలో తొలిసారి అసెంబ్లీలోకి 8మంది ఎమ్మెల్యేలుగా అడుగు పెట్టారు.☞అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా దగ్గుపాటి వెంకటశ్వరప్రసాద్ ☞శింగనమల ఎమ్మెల్యేగా బండారు శ్రావణిశ్రీ☞పెనుకొండ ఎమ్మెల్యేగా సవిత☞పుట్టపర్తి ఎమ్మెల్యేగా పల్లె సింధూరరెడ్డి ☞కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా అమిలినేని సురేంద్రబాబు☞తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ అస్మిత్ రెడ్డి☞ధర్మవరం ఎమ్మెల్యేగా వై.సత్యకుమార్ యాదవ్☞ మడకశిర ఎమ్మెల్యేగా ఎంఎస్ రాజు.
Similar News
News September 30, 2024
అనంతపురం: జూనియర్ షూటింగ్ బాల్ జట్టు ఎంపిక
అనంతపురంలోని సెయింట్ జాన్స్ స్కూల్ పాఠశాల మైదానంలో ఆదివారం జూనియర్ షూటింగ్ బాల్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. 80 మంది బాల, బాలికలు పాల్గొన్నారు. జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. 12 మంది బాలురు, 12 మంది బాలికలు ఎంపికయ్యారన్నారు. అక్టోబర్ 6, 7వ తేదీల్లో కర్నూలు జిల్లా సీ.బెలగల్ ప్రభుత్వ పాఠశాలలో జరగనున్న అంతర్ జిల్లా ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
News September 29, 2024
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: కలెక్టర్
గోరంట్ల మండలంలోని దిగువ గంగం పల్లి తండాలో పిడుగుపాటుకు గురై మృతిచెందిన కుటుంబాన్ని ఆదుకుంటామని శ్రీ సత్యసాయి జిల్లా టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సంఘటనా ప్రాంతానికి పుట్టపర్తి ఆర్డీఓ భాగ్యరేఖ, గోరంట్ల తహశీల్దార్ మారుతి, పశుసంవర్ధక శాఖ అధికారులను అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో జరిగిన వాస్తవాలపై నివేదికను అందజేయాలని ఆదేశించామన్నారు. ప్రభుత్వం తెలపడం మృతుల కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.
News September 29, 2024
ఘర్షణలో కిందపడి వ్యక్తి మృతి
పెద్దపప్పూరు మండలం నరసాపురంలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో వెంకటేశ్-ఆదినారాయణ మధ్య చిన్నపాటి విషయంపై ఘర్షణ జరిగింది. ఇరువురు ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగారు. ఈ క్రమంలో ఆదినారాయణను వెంకటేశ్ కిందకు తోసేశాడు. దీంతో ఆదినారాయణ కింద పడి మృతిచెందాడు. ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.