News June 22, 2024

పరవాడ: అదృశ్యమైన వ్యక్తి మృతి

image

పరవాడ మండలం గొర్లివానిపాలెం JNNURM కాలనీలో నివాసం ఉంటున్న వ్యక్తి మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీ.అప్పారావు కుమారుడు చంద్రశేఖర్ (47) తల్లితో కలిసి కాలనీలో నివాసం ఉంటూ ఫార్మా కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 17న తాగడానికి తల్లి డబ్బులు ఇవ్వలేదని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అదృశ్యమైన చంద్రశేఖర్ శుక్రవారం కాలనీ సమీపంలో చెరువు వద్ద శవమై కనిపించాడు.

Similar News

News November 4, 2025

విశాఖలో టుడే టాప్ న్యూస్

image

➤ విశాఖలో పలు చోట్ల కంపించిన భూమి
➤ భాగ‌స్వామ్య స‌ద‌స్సు ఏర్పాట్లను పరిశీలించిన క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్
➤ మార్గశిర మాసోత్సవాల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష
➤ కంచరపాలెంలో నవంబర్ 7న జాబ్ మేళా
➤ శ్రీకాకుళం నుంచి చర్లపల్లికి రైళ్లు: కేంద్ర మంత్రి
➤ కార్తీక పౌర్ణమి బీచ్ స్నానాలపై మెరైన్ పోలీసులు విజ్ఞప్తి
➤ విశాఖలో బహిరంగ మద్యపానంపై డ్రోన్‌తో నిఘా

News November 4, 2025

కేజీహెచ్‌లో హీమోడయాలసిస్ యంత్రాల ఏర్పాటు

image

కేజీహెచ్‌లోని ఎస్ఎస్ బ్లాక్‌‌ నెఫ్రాలజీ వార్డులో 9 హీమోడయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేశారు. ఓ కంపెనీ CSR నిధుల నుంచి రూ.2 కోట్లతో ఈ యంత్రాలను కేజీహెచ్‌కు అందించింది. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేల చేతుల మీదుగా బుధవారం నుంచి వీటిని అందుబాటులోకి తేనున్నారు.

News November 4, 2025

కంచరపాలెంలో 7న జాబ్ మేళా

image

కంచరపాలెంలో గల జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 7న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో 7 కంపెనీలు పాల్గొనున్నాయి. టెన్త్,ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చదివిన 18 నుంచి 33 సంవత్సరాలలోపు యువతీ, యువకులు అర్హులు. ఆసక్తి కలవారు https://www.ncs.gov.in, https://employment.ap.gov.in లో వివరాలు నమోదు చేసుకొని నవంబర్ 7న ఉదయం 10 గంటలకు ధ్రువపత్రాలతో హాజరు కావాలి.