News June 22, 2024

NEET పేపర్ లీక్‌పై కేంద్రం విచారణ జరుపుతోంది: MP రఘునందన్

image

TG: NEET పేపర్ లీక్‌పై కేంద్రం విచారణ జరుపుతోందని BJP MP రఘునందన్ వెల్లడించారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రతిపాదించిన ఐటీఐఆర్ ప్రాజెక్టును మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఐటీఐఆర్ కింద ప్రతిపాదించిన అన్ని పనులను కేంద్రం పూర్తి చేసిందని తెలిపారు. అటు KCRపైనా ఆయన విమర్శలు చేశారు. గొర్రెల స్కాం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్ ఇంటికి ED అధికారులు రాక తప్పదని జోస్యం చెప్పారు.

Similar News

News February 3, 2026

ఆదోని మున్సిపల్ ఛైర్మన్ పీఠానికి గండం

image

ఆదోని మున్సిపల్ ఛైర్ పర్సన్ లోకేశ్వరి సీటుకు గండం వచ్చింది. 1.25 కోట్ల బసాపురం ఎస్ఎస్ ట్యాంక్ పనులను వియ్యంకుడికి కట్టబెట్టారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఐతే మునిసిపల్ యాక్ట్ 1965 ప్రకారం ఛైర్మన్ బంధువులకు పనులు ఇవ్వడం చట్ట విరుద్ధం అని చట్టం స్పష్టంగా చెబుతుంది. ఇటీవలే కడప మేయర్ సురేశ్ బాబు ఇదే విషయంపై అనర్హత వేటుకు గురయ్యారు. ఆదోని విషయంపై ఇక్కడి కూటమి నేతలు మౌనం అనుమానాలు రేకెత్తుతున్నాయి.

News February 3, 2026

ఆదోని మున్సిపల్ ఛైర్మన్ పీఠానికి గండం

image

ఆదోని మున్సిపల్ ఛైర్ పర్సన్ లోకేశ్వరి సీటుకు గండం వచ్చింది. 1.25 కోట్ల బసాపురం ఎస్ఎస్ ట్యాంక్ పనులను వియ్యంకుడికి కట్టబెట్టారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఐతే మునిసిపల్ యాక్ట్ 1965 ప్రకారం ఛైర్మన్ బంధువులకు పనులు ఇవ్వడం చట్ట విరుద్ధం అని చట్టం స్పష్టంగా చెబుతుంది. ఇటీవలే కడప మేయర్ సురేశ్ బాబు ఇదే విషయంపై అనర్హత వేటుకు గురయ్యారు. ఆదోని విషయంపై ఇక్కడి కూటమి నేతలు మౌనం అనుమానాలు రేకెత్తుతున్నాయి.

News February 3, 2026

GWL: విద్యా నిధి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

image

అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గద్వాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిణి నుషిత సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు http:///www.epass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.