News June 22, 2024

NEETపై కొన్ని రాజకీయ పార్టీలు మౌనంగా ఉన్నాయి: VSR

image

NEET యూజీ పరీక్షలో జరిగిన అవకతవకలపై కొన్ని రాజకీయ పార్టీలు మౌనంగా ఉన్నాయని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి మండిపడ్డారు. నీట్ యూజీ పరీక్షకు ఏపీ నుంచి హాజరైన 60వేల మందితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 23 లక్షల మంది విద్యార్థుల కోసం ఆ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ఇది చూస్తుంటే వారికి ప్రజలు, విద్యార్థుల జీవితాల కంటే రాజకీయాలే ముఖ్యమని తెలుస్తోందని ఎద్దేవా చేశారు.

Similar News

News February 15, 2026

UN రిపోర్ట్.. 3 రోజుల్లో 6,000 మంది హతం!

image

సుడాన్‌లోని డార్ఫర్‌లో గతేడాది OCTలో పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్సెస్ మారణహోమం సృష్టించాయని ఐక్యరాజ్యసమితి(UN) తాజాగా విడుదల చేసిన రిపోర్టులో పేర్కొంది. RSF దాడుల్లో 3 రోజుల్లోనే (OCT 25th-27th) 6వేల మందికి పైగా మరణించారని వెల్లడించింది. RSF సైనికులు సామూహిక హత్యలు, లైంగిక హింసకు పాల్పడినట్లు తెలిపింది. సూడాన్ మిలిటరీ, RSFకి మధ్య 2023 APRలో మొదలైన ఆధిపత్య పోరు యుద్ధానికి దారితీసింది.

News February 15, 2026

లవ్లీ హోం హ్యాక్స్..

image

* చెక్క ఫర్నిచర్‌పై నీటి మరకలు అంత త్వరగా పోవు. అలాంటప్పుడు పేపర్ టవల్‌లో కొద్దిగా మయోనైజ్ రాసి అద్ది తుడిస్తే సరిపోతుంది. * చెత్త డబ్బాలు ఉంచే చోట ఆ దుర్వాసన పోవాలంటే అరకప్పు వెనిగర్ కి, అరకప్పు వంటసోడా కలిపి ఉంచాలి. * వెండి వస్తువులు ఉంచే డబ్బాలో ఓ సుద్దముక్కను కూడా ఉంచితే ఆభరణాలు నల్లబడకుండా ఉంటాయి. * వెనిల్లా పరిమళంలో ముంచిన దూదిని ఫ్రిజ్‌లో ఉంచితే అది దాంట్లోని దుర్వాసనల్ని పీల్చుకుంటుంది.

News February 15, 2026

నిర్జీవంగా వేప చెట్లు.. కారణం ఏమిటి?

image

పంటలను చీడపీడల నుంచి కాపాడే వేప చెట్లే తెగుళ్ల బారినపడటం కలవరపెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల వేప చెట్ల కొమ్మలు, రెమ్మలు మాడి నిర్జీవంగా కనిపిస్తున్నాయి. ఫోమోప్సిస్ అజాడిరక్టే ఫంగస్ వల్లే ఇలా జరుగుతున్నట్లు వ్యవసాయ నిపుణులు తెలిపారు. ఇది ఒక చెట్టు నుంచి మరో చెట్టును ఆశిస్తోంది. అయితే ఇది ఏడాదిలో కొంతకాలం పాటే చెట్లకు సోకుతుందని, మళ్లీ ఈ చెట్లు కోలుకొని మళ్లీ పచ్చగా మారతాయని చెబుతున్నారు.