News June 22, 2024

జగన్‌పై పులివెందుల ప్రజలు తిరగబడ్డారు: TDP

image

AP: వైఎస్ జగన్ ఫ్యూడల్ మనస్తత్వంపై పులివెందుల వైసీపీ కార్యకర్తలు తిరగబడ్డారని టీడీపీ ట్వీట్ చేసింది. జగన్ ప్యాలెస్‌లోకి దూసుకెళ్లి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని పేర్కొంది. అధికారంలో ఉండగా తాడేపల్లికే పరిమితమై ఇప్పుడు గుర్తుకు వచ్చామా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపింది. జగన్ ఇంటి అద్దాలు ధ్వంసం చేశారని రాసుకొచ్చింది.

Similar News

News October 9, 2024

హనుమంత వాహనంపై మలయప్పస్వామి

image

AP: తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం హనుమంత వాహనంపై రామావతారంలో మలయప్పస్వామి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7గంటలకు గజ వాహనంపై మలయప్పస్వామి ఊరేగుతారు.

News October 9, 2024

ఇరాన్ ఎంబసీ సమీపంలో ఇజ్రాయెల్ మిసైల్స్ అటాక్

image

సిరియా డమాస్కస్‌లోని ఇరాన్ ఎంబసీ సమీపంలో ఇజ్రాయెల్ మిలిటరీ ఎయిర్‌స్ట్రైక్స్ చేపట్టింది. వెపన్స్ స్మగ్లింగ్‌లో జోక్యం ఉన్న హై ర్యాంకింగ్ హెజ్బొల్లా టెర్రరిస్టే లక్ష్యంగా దాడి చేసినట్టు తెలిసింది. సిరియా న్యూస్ ఏజెన్సీ SANA దీనిని కన్ఫమ్ చేసింది. ఫారిన్ ఎంబసీ దగ్గర్లోని కమర్షియల్ బిల్డింగ్‌పై ఇజ్రాయెల్ 3 మిసైళ్లు ప్రయోగించినట్టు తెలిపింది. ఈ దాడిలో ఏడుగురు మరణించారని వెల్లడించింది.

News October 9, 2024

హరియాణాలో కాంగ్రెస్‌కు పెరిగిన ఆదరణ

image

హరియాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇక్కడ BJP-కాంగ్రెస్ మధ్య 11 సీట్ల తేడా ఉన్నప్పటికీ ఓటు షేర్‌లో రెండింటికీ 39% వచ్చింది. 2019లో కాంగ్రెస్‌కు 28.08% ఓట్లు రాగా, ప్రస్తుతం గణనీయంగా ఆదరణ పెరిగింది. BJP గత ఎన్నికల్లో 36.49% ఓటు బ్యాంక్‌తో 40సీట్లు గెలుచుకుంది. జననాయక్ జనతా పార్టీకి 2019లో 14.80% ఓట్లతో 10సీట్లలో విజయఢంకా మోగించింది.