News June 22, 2024
జింబాబ్వేతో టీ20 సిరీస్కు రేపు భారత జట్టు ప్రకటన?
జింబాబ్వేతో టీ20 సిరీస్కు భారత జట్టును BCCI రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. ఈ సిరీస్లో సీనియర్లకు రెస్ట్ ఇచ్చి, ఐపీఎల్లో సత్తా చాటిన యంగ్ ప్లేయర్లను సెలక్ట్ చేయనున్నట్లు సమాచారం. జులై 6 నుంచి జరిగే ఈ 5 మ్యాచుల సిరీస్కు హార్దిక్/సూర్య కెప్టెన్సీ వహించే ఛాన్సుందని, ఒకవేళ వారికి రెస్ట్ ఇస్తే శ్రేయస్, రుతురాజ్, పంత్లో ఒకరికి కెప్టెన్సీ ఇవ్వొచ్చని క్రీడా విశ్లేషకుల అంచనా.
Similar News
News October 9, 2024
ఇరాన్ ఎంబసీ సమీపంలో ఇజ్రాయెల్ మిసైల్స్ అటాక్
సిరియా డమాస్కస్లోని ఇరాన్ ఎంబసీ సమీపంలో ఇజ్రాయెల్ మిలిటరీ ఎయిర్స్ట్రైక్స్ చేపట్టింది. వెపన్స్ స్మగ్లింగ్లో జోక్యం ఉన్న హై ర్యాంకింగ్ హెజ్బొల్లా టెర్రరిస్టే లక్ష్యంగా దాడి చేసినట్టు తెలిసింది. సిరియా న్యూస్ ఏజెన్సీ SANA దీనిని కన్ఫమ్ చేసింది. ఫారిన్ ఎంబసీ దగ్గర్లోని కమర్షియల్ బిల్డింగ్పై ఇజ్రాయెల్ 3 మిసైళ్లు ప్రయోగించినట్టు తెలిపింది. ఈ దాడిలో ఏడుగురు మరణించారని వెల్లడించింది.
News October 9, 2024
హరియాణాలో కాంగ్రెస్కు పెరిగిన ఆదరణ
హరియాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇక్కడ BJP-కాంగ్రెస్ మధ్య 11 సీట్ల తేడా ఉన్నప్పటికీ ఓటు షేర్లో రెండింటికీ 39% వచ్చింది. 2019లో కాంగ్రెస్కు 28.08% ఓట్లు రాగా, ప్రస్తుతం గణనీయంగా ఆదరణ పెరిగింది. BJP గత ఎన్నికల్లో 36.49% ఓటు బ్యాంక్తో 40సీట్లు గెలుచుకుంది. జననాయక్ జనతా పార్టీకి 2019లో 14.80% ఓట్లతో 10సీట్లలో విజయఢంకా మోగించింది.
News October 9, 2024
వడ్డీరేట్లు తగ్గించని RBI..
అక్టోబర్ పాలసీ మీటింగ్లోనూ రెపోరేట్లపై ఆర్బీఐ స్టేటస్ కో ప్రకటించింది. వడ్డీరేట్లను తగ్గించడం లేదని గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. రెపోరేటును 6.5% వద్ద యథాతథంగా ఉంచుతున్నామని పేర్కొన్నారు. న్యూట్రల్ వైఖరినే అవలంబిస్తున్నామని చెప్పారు. ఇన్ఫ్లేషన్ తగ్గుదల ఇంకా నెమ్మదిగా, అసాధారణంగానే ఉందన్నారు. యూఎస్ ఫెడ్ 50 బేసిస్ పాయింట్ల మేర కత్తిరించినా ఆర్బీఐ ఆచితూచి వ్యవహరిస్తోంది.