News June 22, 2024
29 నుంచి అమర్నాథ్ యాత్ర.. భారీ భద్రత
ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్రకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు LG మనోజ్ సిన్హా తెలిపారు. యాత్ర ప్రారంభానికి సూచికగా ఇవాళ నిర్వహించిన ప్రథమ పూజలో ఆయన వర్చువల్గా పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో నిఘా పెంచినట్లు ఏడీజీపీ ఆనంద్ జైన్ చెప్పారు. హైవే వెంబడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. కాగా ఆగస్టు 19 వరకు యాత్ర కొనసాగనుంది.
Similar News
News October 9, 2024
హనుమంత వాహనంపై మలయప్పస్వామి
AP: తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం హనుమంత వాహనంపై రామావతారంలో మలయప్పస్వామి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7గంటలకు గజ వాహనంపై మలయప్పస్వామి ఊరేగుతారు.
News October 9, 2024
ఇరాన్ ఎంబసీ సమీపంలో ఇజ్రాయెల్ మిసైల్స్ అటాక్
సిరియా డమాస్కస్లోని ఇరాన్ ఎంబసీ సమీపంలో ఇజ్రాయెల్ మిలిటరీ ఎయిర్స్ట్రైక్స్ చేపట్టింది. వెపన్స్ స్మగ్లింగ్లో జోక్యం ఉన్న హై ర్యాంకింగ్ హెజ్బొల్లా టెర్రరిస్టే లక్ష్యంగా దాడి చేసినట్టు తెలిసింది. సిరియా న్యూస్ ఏజెన్సీ SANA దీనిని కన్ఫమ్ చేసింది. ఫారిన్ ఎంబసీ దగ్గర్లోని కమర్షియల్ బిల్డింగ్పై ఇజ్రాయెల్ 3 మిసైళ్లు ప్రయోగించినట్టు తెలిపింది. ఈ దాడిలో ఏడుగురు మరణించారని వెల్లడించింది.
News October 9, 2024
హరియాణాలో కాంగ్రెస్కు పెరిగిన ఆదరణ
హరియాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇక్కడ BJP-కాంగ్రెస్ మధ్య 11 సీట్ల తేడా ఉన్నప్పటికీ ఓటు షేర్లో రెండింటికీ 39% వచ్చింది. 2019లో కాంగ్రెస్కు 28.08% ఓట్లు రాగా, ప్రస్తుతం గణనీయంగా ఆదరణ పెరిగింది. BJP గత ఎన్నికల్లో 36.49% ఓటు బ్యాంక్తో 40సీట్లు గెలుచుకుంది. జననాయక్ జనతా పార్టీకి 2019లో 14.80% ఓట్లతో 10సీట్లలో విజయఢంకా మోగించింది.