News June 23, 2024
MBNR: జులై 7 వరకు ఓపెన్ PG పరీక్ష ఫీజు చెల్లించండి
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వార్షిక పరీక్ష ఫీజును ఆన్లైన్లో చెల్లించాలని ఉమ్మడి జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లించేందుకు జులై 7 వరకు గడువు ఉందన్నారు. సెకండియర్ పరీక్షలు జులై 31 నుంచి ఫస్టియర్ పరీక్షలు ఆగస్టు 9 నుంచి నిర్వహిస్తామని చెప్పారు. మరింత సమాచారం కోసం వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
Similar News
News October 1, 2024
యువతలో సృజనాత్మకత వెలికి తీయాలి: సిక్తా పట్నాయక్
యువతలో దాగిన సృజనాత్మకత వెలికి తీయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో జాతీయ యువజన ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సైన్స్ ఫెయిర్ లో ఆవిష్కరణలను పరిశీలించారు. విద్యార్థులు, యువకులు చేసిన నృత్యాలను చూసి అభినందించారు. సైన్స్ ఫెయిర్ జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన వారికి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని చెప్పారు.
News September 30, 2024
NRPT: గురుకుల పాఠశాలలో కలెక్టర్ రాత్రి బస
నారాయణపేట జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సోమవారం రాత్రి బస చేశారు. రాత్రి గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ పాఠశాల వంటగదికి వెళ్లి విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వంట సామాగ్రి, నిత్యావసర సరుకులను, తాగునీటిని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి అక్కడే పాఠశాలలో నిద్రించారు.
News September 30, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు.. !
✒దౌల్తాబాద్:అంత్యక్రియలకు వెళ్తూ ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
✒ఉమ్మడి జిల్లాలో దసరా వేడుకలు షురూ
✒మెదక్ పై పాలమూరు ఘనవిజయం..ఇక సెమి ఫైనల్
✒GDWL: మహిళపై అత్యాచారయత్నం.. కేసు నమోదు
✒దోపిడీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి:RS ప్రవీణ్
✒రైతు డిక్లరేషన్ను కాంగ్రెస్ తుంగలో తొక్కింది: డీకే అరుణ
✒DSC ఫలితాలు విడుదల..1:3 పై ఫోకస్
✒నల్లమలలో టైగర్ సఫారీ రెడీ.. ఇక ఆన్లైన్ బుకింగ్