News June 23, 2024
కిరాయికి ఎద్దులు
వానకాలం ప్రారంభం కావడంతో వ్యవసాయ సీజన్ మొదలైంది. నల్గొండ జిల్లాలో చాలా వరకు రైతులు ప్రధానంగా పత్తిని పండిస్తారు. విత్తనాలను విత్తడం, వరుసలు వేయడం, పంటలో కలుపు తీయడానికి గుంటుక కొట్టడం తదితర పనులను ఎద్దుల అవసరం ఉంటుంది. ఎద్దులు ఉన్న రైతులు వాటిని కిరాయికి ఇచ్చి జీవనం సాగిస్తున్నారు. మనిషితో అయితే రూ.2వేలు, మనిషి లేకుండా కేవలం ఎద్దులే అయితే రూ.1500 వరకు అద్దె చెల్లిస్తున్నారు.
Similar News
News September 30, 2024
నల్గొండ: ఏసీబీకి చిక్కిన పశు వైద్యాధికారి
చింతపల్లి మండల పశు వైద్యాధికారి జోసఫ్ పాల్ రూ.6,000 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. గేదెల బ్యాంకు లోన్, హెల్త్ సర్టిఫికెట్ కోసం నసర్లపల్లికి చెందిన ఓ రైతు వద్ద రూ.8వేలు డిమాండ్ చేసి రూ.6 వేలు తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 1064 నంబర్ కి ఫోన్ చేయాలని ఉమ్మడి ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర తెలిపారు.
News September 30, 2024
NLG: కాసేపట్లో రిజల్ట్స్.. పోటీ ఇలా..
DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్జీటీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా అభ్యర్థులు పోస్టులు పోటీ
NLG 3187 373 1:08
SRPT 2981 213 1:13
యాదాద్రి 742 135 1:05
News September 30, 2024
NLG: దసరాకు వినూత్నమైన ఆఫర్
తెలంగాణలో అతిపెద్ద పండగ ‘దసరా’. ఈ పండుగకు వస్త్ర, నగల వ్యాపార సంస్థలు భారీగా ఆఫర్లను పెడుతూ కస్టమర్లను ఆకర్షిస్తుంటాయి. NLG జిల్లాలోని శాలిగౌరారం మండలం పెర్కకొండారంలో యువకులు వినూత్నంగా ‘రూ. 200 కొట్టు మేకను పట్టు’ అనే ఆఫర్ పెట్టారు. ఈ కూపన్ ఆఫర్లో మేక, నాటు కోళ్లు, మందు బాటిళ్లు గెలిచిన వారికి బహుమతిగా ప్రకటించారు. విషయం తమ దృష్టికి వచ్చిందని కౌన్సెలింగ్ ఇస్తామని ఎస్సై సైదులు తెలిపారు.