News June 23, 2024

30 నుంచి DAO రాతపరీక్షలు

image

TG: రాష్ట్రంలో 53 డివిజనల్ ఎకౌంట్స్ అధికారుల పోస్టుల భర్తీకి ఈ నెల 30 నుంచి పరీక్షలు జరుగుతాయని TGPSC తెలిపింది. జూలై 4 వరకు మల్టీసెషన్స్, CBRT విధానంలో పరీక్షలు నిర్వహిస్తామంది. ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయంది. అభ్యర్థులు ఈ నెల 25 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Similar News

News October 9, 2024

వీఐపీల కోసం క్యూలైన్లు ఆపడం లేదు: మంత్రి అనిత

image

AP: ఇంద్రకీలాద్రిపై సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అనిత తెలిపారు. వీఐపీల కోసం క్యూలైన్లు ఆపడం లేదని స్పష్టం చేశారు. మూడు గంటల్లోనే దర్శనం పూర్తి అవుతోందని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. మొదటి 2-3 గంటలే భక్తులు కంపార్ట్‌మెంట్లలో నిరీక్షించారని తెలిపారు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పని చేస్తూ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు.

News October 9, 2024

CM రేవంత్‌రెడ్డిని కలిసిన BRS MLA మల్లారెడ్డి

image

TG: BRS MLA మల్లారెడ్డి CM రేవంత్‌రెడ్డిని కలిశారు. తన మనవరాలి వివాహానికి రావాలంటూ రేవంత్‌కు ఆహ్వానపత్రిక అందజేశారు. అటు మాజీ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం చంద్రబాబును సైతం మల్లారెడ్డి ఆహ్వానించారు.

News October 9, 2024

J&K ప్రజలకు కృతజ్ఞతలు: రాహుల్ గాంధీ

image

జమ్మూకశ్మీర్‌లో తమ కూటమి సాధించిన గెలుపు రాజ్యాంగ విజయంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభివర్ణించారు. విజయాన్ని అందించిన J&K ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. హరియాణాలో వచ్చిన ఊహించని ఫలితాలపై విశ్లేషిస్తున్నామని తెలిపారు. అనేక అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తున్నామని ట్వీట్ చేశారు.