News June 23, 2024
వైసీపీ ఆఫీసు కూల్చివేత దుర్మార్గం: ధర్మాన

తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ రాష్ట్ర కార్యాలయాన్ని కూల్చడం దుర్మార్గమైన చర్య అని ఆపార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ‘ఇది ముమ్మాటికీ కక్షపూరిత చర్య. ఉదయాన్నే భారీ పోలీసు బందోబస్తుతో ఆఫీసు కూల్చడం సరికాదు. ఈ కేసు కోర్టులో ఉన్నప్పటికీ ఇలా చేయడం ఏంటి? చట్టాన్ని అతిక్రమించకండి’ అని సీఆర్డీఏ అధికారులకు ఆయన సూచించారు.
Similar News
News February 27, 2026
SKLM: ఇంటర్ పరీక్షలకు 289 మంది గైర్హాజరు

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలకు శుక్రవారం 289 మంది గైర్హాజరయ్యారు. హిస్టరీ బాటనీ ఒకేషనల్ కోర్సుల్లో 60 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్ష రాశారు. రెగ్యులర్ కోర్సులకు 1,538 మంది హాజరు కావాల్సి ఉండగా, 1,372 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 1,500 మంది రాయాల్సి ఉండగా, 1,377 మంది విద్యార్థులు రాశారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్కు పాల్పడలేదు.
News February 27, 2026
ఘనంగా అరసవల్లి ఆదిత్యుని కళ్యాణం

అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శుక్రవారం స్వామి వారి కళ్యాణం జరిగింది. పాల్గుణ శుద్ధ ఏకాదశి సందర్భంగా కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఉదయం 8 గంటలకు అనివేటి మండపంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కళ్యాణం జరిగిందని ఆలయ డీసీ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
News February 27, 2026
శ్రీకాకుళంలో అదుపులోకి వస్తున్న డయేరియా

శ్రీకాకుళం నగరంలోని ఐదు సచివాలయాల పరిధిలో ఈనెల 23న మొదలైన డయేరియా అదుపులోకి వస్తోంది. గురువారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 102కు చేరగా, ప్రస్తుతం 67 మంది బాధితులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయి. పరిస్థితిని పర్యవేక్షిస్తూ అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంది. వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.


