News June 23, 2024
BHPL: అనుమానాస్పదంగా ఉరేసుకొని వ్యక్తి మృతి
జయశంకర్ భూపాలపల్లి ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఉరేసుకొని మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలోని సుభాశ్ కాలనీలో జరిగింది. మృతదేహం కుళ్లిపోయి వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు కొండపర్తి శివగా పోలీసులు గుర్తించారు.
Similar News
News October 8, 2024
వరంగల్: పండుగ సందర్భంగా 6556 ప్రత్యేక రైళ్లు
భారతీయ రైల్వేలు అక్టోబర్ 6 నాటికి దుర్గాపూజ, దీపావళి, ఛత్ పూజల సమయంలో ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు 6556 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రౌల్వే ప్రకటించినది. ప్రతి సంవత్సరం పండుగల సమయంలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్యను గణనీయంగా పెంచినట్లు రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలియజేశారు.
News October 8, 2024
HYD నుంచి ఓరుగల్లుకు బాట!
దసరా పండుగతో HYD ఖాళీ అవుతోంది. ఉద్యోగాల కోసం నగరానికి వచ్చిన ఓరుగల్లు ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ క్రమంలో ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సుల కోసం క్యూ కట్టారు. దీంతో ఉప్పల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నప్పటికీ ప్రయాణికుల సంఖ్యకు సరిపోవడం లేదు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరూ వస్తే కామెంట్ చేయండి.
News October 8, 2024
HNK: ‘పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించింది’
తల్లిదండ్రులు లేకపోయినా నిరుత్సాహ పడలేదు. పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన బొల్లెపల్లి శ్రీజకు తల్లిదండ్రులు లేరు. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో పోటీ పరీక్షలు రాసి మల్టీ జోనల్ 22వ ర్యాంక్ సాధించింది. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఈవోగా నియామక పత్రం అందుకుంది.