News June 23, 2024

REWIND: భారత్ చారిత్రక గెలుపునకు 11 ఏళ్లు

image

ధోనీ నాయకత్వంలో భారత్ తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి నేటితో 11 ఏళ్లు పూర్తయ్యింది. 2013 జూన్ 23న ఇంగ్లండ్‌పై ఫైనల్‌లో 5 పరుగుల తేడాతో చారిత్రక విజయం సాధించింది. తొలుత భారత్ 129/7 స్కోర్ చేసింది. కోహ్లీ 43, జడేజా 33, ధవన్ 31 పరుగులతో రాణించారు. తర్వాత ENGని 124/8కే బౌలర్లు కట్టడి చేశారు. జడేజా, అశ్విన్, ఇషాంత్ తలో 2 వికెట్లు తీశారు. కాగా వచ్చే ఏడాది పాక్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.

Similar News

News October 9, 2024

JOE ROOT: ‘గే’ అని గేలి చేసినా..!

image

టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తున్నారు. గత నాలుగేళ్లలో అత్యుత్తమ ఫామ్ ప్రదర్శించి ఏకంగా 18 సెంచరీలు బాదారు. కాగా రూట్ 2021కు ముందు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. తరచూ ఆయనను ప్రత్యర్థులు ‘గే’ అంటూ ఎగతాళి చేసేవారు. ఆయన వాటినేం పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టేవారు. అతడిని ‘గే’ అని పిలిచినందుకు వెస్టిండీస్ బౌలర్ గాబ్రియేల్ 4 మ్యాచ్‌ల నిషేధం కూడా ఎదుర్కొన్నారు.

News October 9, 2024

3 రోజుల్లోనే ఖాతాల్లోకి డబ్బులు: మంత్రి

image

TG: ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండ(D) అర్జాలబావి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకే రూ.500 బోనస్ ఇస్తున్నామని అన్నారు. రుణమాఫీ కాని రైతులకు వారం రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు.

News October 9, 2024

కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్

image

రసాయనశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. ‘ప్రొటీన్ స్ట్రక్చర్ ప్రెడిక్షన్‌’కు గాను డేమిస్ హసాబిస్, జాన్ ఎం.జంపర్‌‌లకు, ‘కంప్యూటేషనల్ ప్రొటీన్ డిజైన్’కు గాను డేవిడ్ బెకర్‌కు సంయుక్తంగా నోబెల్ ప్రైజ్ వచ్చింది.