News June 23, 2024
జమ్మూకశ్మీర్లో 40మంది పాక్ ఉగ్రవాదులు?
జమ్మూకశ్మీర్లో 40మంది వరకు పాక్ ఉగ్రవాదులు నక్కినట్లు భద్రతా బలగాలు గుర్తించినట్లు సమాచారం. ప్రధానంగా జమ్మూలోని రాజౌరి, పూంఛ్, కథువా సెక్టార్లలో వీరు ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న బృందాలుగా విడిపోయి ఉగ్రవాదాన్ని మళ్లీ బతికించేందుకు ముష్కరులు యత్నిస్తున్నారని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. వారిని ఏరివేసేందుకు జల్లెడ పడుతున్నామన్నాయి. ఈ నెల 9 నుంచి జమ్మూకశ్మీర్లో 4 ఉగ్రదాడులు చోటుచేసుకోవడం గమనార్హం.
Similar News
News October 9, 2024
గ్రూప్-1 మెయిన్స్పై కీలక అప్డేట్
TG: గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లను ఈనెల 14న విడుదల చేయనున్నట్లు TGPSC ప్రకటించింది. అదే రోజు నుంచి కమిషన్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే.
News October 9, 2024
JOE ROOT: ‘గే’ అని గేలి చేసినా..!
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ అన్స్టాపబుల్గా దూసుకెళ్తున్నారు. గత నాలుగేళ్లలో అత్యుత్తమ ఫామ్ ప్రదర్శించి ఏకంగా 18 సెంచరీలు బాదారు. కాగా రూట్ 2021కు ముందు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. తరచూ ఆయనను ప్రత్యర్థులు ‘గే’ అంటూ ఎగతాళి చేసేవారు. ఆయన వాటినేం పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టేవారు. అతడిని ‘గే’ అని పిలిచినందుకు వెస్టిండీస్ బౌలర్ గాబ్రియేల్ 4 మ్యాచ్ల నిషేధం కూడా ఎదుర్కొన్నారు.
News October 9, 2024
3 రోజుల్లోనే ఖాతాల్లోకి డబ్బులు: మంత్రి
TG: ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండ(D) అర్జాలబావి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకే రూ.500 బోనస్ ఇస్తున్నామని అన్నారు. రుణమాఫీ కాని రైతులకు వారం రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు.