News June 23, 2024
SA-Wపై భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్స్వీప్
భారత మహిళల జట్టు అదరగొట్టింది. సౌతాఫ్రికాపై మూడో వన్డేలోనూ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. తొలుత దక్షిణాఫ్రికా 215/8 స్కోర్ చేయగా, టీమ్ ఇండియా 40.4 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. స్మృతి మంధాన 90, షఫాలీ వర్మ 25, ప్రియా పునియా 28, హర్మన్ప్రీత్ 42, జెమీమా 19* రన్స్ చేశారు. దీప్తి శర్మ, అరుంధతీరెడ్డి చెరో 2 వికెట్లు, శ్రేయాంక, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ తీశారు.
Similar News
News October 9, 2024
గ్రూప్-1 మెయిన్స్పై కీలక అప్డేట్
TG: గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లను ఈనెల 14న విడుదల చేయనున్నట్లు TGPSC ప్రకటించింది. అదే రోజు నుంచి కమిషన్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే.
News October 9, 2024
JOE ROOT: ‘గే’ అని గేలి చేసినా..!
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ అన్స్టాపబుల్గా దూసుకెళ్తున్నారు. గత నాలుగేళ్లలో అత్యుత్తమ ఫామ్ ప్రదర్శించి ఏకంగా 18 సెంచరీలు బాదారు. కాగా రూట్ 2021కు ముందు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. తరచూ ఆయనను ప్రత్యర్థులు ‘గే’ అంటూ ఎగతాళి చేసేవారు. ఆయన వాటినేం పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టేవారు. అతడిని ‘గే’ అని పిలిచినందుకు వెస్టిండీస్ బౌలర్ గాబ్రియేల్ 4 మ్యాచ్ల నిషేధం కూడా ఎదుర్కొన్నారు.
News October 9, 2024
3 రోజుల్లోనే ఖాతాల్లోకి డబ్బులు: మంత్రి
TG: ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండ(D) అర్జాలబావి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకే రూ.500 బోనస్ ఇస్తున్నామని అన్నారు. రుణమాఫీ కాని రైతులకు వారం రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు.