News June 24, 2024

విజయవాడ: వరల్డ్ కప్‌లో ధీరజ్‌కు రెండు పతకాలు

image

అట్లాంటా టర్కీలో జరిగిన వరల్డ్ కప్ స్టేజ్-3లో విజయవాడకు చెందిన బొమ్మదేవర ధీరజ్ పతకాలు కైవసం చేసుకున్నాడు. రికర్వ్ రౌండ్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం, మిక్సీడ్ టీమ్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ధీరజ్ పతకాలు సాధించి వచ్చే ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత జట్టులో బెర్త్ సాధించాడు. ఈ సందర్భంగా ధీరజ్ ను ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ సభ్యులు అభినందించారు.

Similar News

News October 6, 2024

ప్రజలపై టికెట్ రేట్ల భారం మోపము: ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల

image

ఆర్టీసీ ఛైర్మన్‌గా కొనకళ్ళ నారాయణరావు విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో అధికారుల సమక్షంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను సురక్షితంగా, సౌలభ్యంగా గమ్యాలకు చేర్చే సాధనం ఏపీఎస్ఆర్టీసీ అన్నారు. ఆర్టీసీకి నష్టం వచ్చినా, ప్రజలపై టికెట్ భారం వేయకుండా ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. పేదవారికి, మధ్య తరగతి వారికి ఆర్టీసీని అందుబాటులో ఉంచుతామన్నారు.

News October 6, 2024

విజయవాడ: దుర్గమ్మ రేపు ఏ అవతారంలో దర్శనమిస్తారంటే?

image

శరన్నవరాత్రులలో భాగంగా దుర్గమ్మ రేపు ఆదివారం నాలుగో రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీ లలితా దేవి తనను కొలిచిన భక్తుల దారిద్ర దుఃఖాలు నశింపచేస్తుందని పండితులు తెలిపారు. చెరకుగడ, విల్లు, పాశము, అంకుశము ధరించిన అమ్మవారు భక్తుల ఇక్కట్లు తొలగించి, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందన్నారు.

News October 6, 2024

తిరుమలపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది: ఎమ్మెల్యే సుజనా

image

వైసీపీ పదేపదే తిరుమలపై దుష్ప్రచారం చేస్తోందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా శనివారం ట్వీట్ చేశారు. ‘ఎందుకు తిరుమల అంటే మీకు అంత కోపం, హిందువుల మనోభావాలంటే అంత చులకన’ అంటూ వైసీపీని సుజనా ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. డిక్లరేషన్ మీద సంతకం చెయ్యమంటే చెయ్యరు.. కానీ తిరుమల మీద దుష్ప్రచారం చేస్తారని సుజనా ఈ మేరకు జగన్‌ను ఉద్దేశించి Xలో పోస్ట్ చేశారు.