News June 24, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం
∆} జూనియర్ డాక్టర్లు నేటి నుంచి సమ్మె
∆} వర్షాలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యాటన
∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
Similar News
News September 20, 2025
PM ఆవాస్ యోజన గ్రామీణ్ సర్వేను వారం రోజుల్లో పూర్తి చేయాలి: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ సర్వేను వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను శుక్రవారం ఆదేశించారు. ఇప్పటివరకు 571 గ్రామాలలో 69 శాతం సర్వే పూర్తయిందని, మిగిలిన 13,663 ఇండ్ల సర్వే త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సర్వే పూర్తితో కేంద్ర నిధులు అందుతాయని, మరిన్ని ఇండ్ల నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. సమావేశంలో ఎంపిడివోలు, అధికారులు పాల్గొన్నారు.
News September 19, 2025
సీతారామ ప్రాజెక్ట్ భూ సేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్లో భూ సేకరణ, అటవీ సమస్యలు ఆలస్యానికి కారణమని అధికారులు పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న భూముల బదలాయింపు, అవార్డులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూటరీ కాల్వల సర్వే 20 రోజుల్లో పూర్తిచేయాలని సూచించారు.
News September 19, 2025
ఖమ్మం: సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన కలెక్టర్

రాపర్తి నగర్లోని TGMRJC బాలికల జూనియర్ కళాశాలలో నిట్, ఐఐటీ ఆశావహ విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. లైబ్రరీ, తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థినులు, తల్లిదండ్రులతో ఆత్మీయంగా మాట్లాడి తన అనుభవాలను పంచుకున్నారు. ఇంటర్లో కృషి చేస్తే మంచి కెరీర్ సాధ్యమని, పోటీ పరీక్షల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.