News June 24, 2024
హజ్ యాత్రలో మృత్యుఘోష.. 1300 మంది మృతి!

ఈ ఏడాది హజ్ యాత్రలో దాదాపు 1300 మంది మరణించినట్లు తెలుస్తోంది. వీరిలో 130 మందికిపైగా భారతీయులు ఉన్నట్లు సమాచారం. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేక వీరంతా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువగా ఈజిప్టుకు చెందినవారే కావడం గమనార్హం. కాగా ఈసారి యాత్రలో 18లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. సౌదీ అరేబియాలో రికార్డు స్థాయిలో 51డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Similar News
News January 24, 2026
జనవరి 24: చరిత్రలో ఈరోజు

1757: బొబ్బిలి యుద్ధం ప్రారంభం
1950: జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా స్వీకరించిన భారత ప్రభుత్వం
1966: భారత ప్రధానిగా ఇందిరా గాంధీ(ఫొటోలో) బాధ్యతలు స్వీకరణ
1966: అణు శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా మరణం
1981: సినిమా నటి కాంచనమాల మరణం
* జాతీయ బాలికా దినోత్సవం
News January 24, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 24, 2026
కాల్పుల కేసులో బాలీవుడ్ నటుడు అరెస్ట్!

ముంబైలోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్పై కాల్పులు జరిగిన ఘటనలో బాలీవుడ్ నటుడు కమాల్ ఆర్ ఖాన్(KRK)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫైరింగ్ చేసిన తుపాకీని సీజ్ చేశారు. తన లైసెన్స్డ్ గన్ నుంచి తానే కాల్పులు జరిపినట్లు ఆయన ఒప్పుకున్నారు. గన్ని క్లీన్ చేశాక టెస్ట్ చేసేందుకు 4 రౌండ్స్ ఫైర్ చేసినట్లు తెలిపారు. జనవరి 18న ఘటన జరగ్గా పోలీసులు దర్యాప్తు చేసి ఫైరింగ్ జరిపింది KRKగా గుర్తించారు.


