News June 24, 2024

బాన్సువాడ: గొడ్డలితో నరికి.. సెప్టిక్ ట్యాంకులో పడేశారు

image

మామతో కలిసి ఓ మహిళ <<13495824>>భర్తను హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. CI కృష్ణ వివరాల ప్రకారం.. తిర్మలాపూర్‌కు చెందిన రాములు(40) తాగివచ్చి భార్య మంజుల, తండ్రి నారాయణతో గొడవపడేవాడు. అది భరించలేక రాములును వారిద్దరూ కలిసి ఈనెల 9న గొడ్డలితో నరికి హత్య చేసి శవాన్ని సెప్టిక్ ట్యాంకులో పడేశారు. రెండు రోజుల తర్వాత ఇంటి ఎదుట గొయ్యి తీసిపూడ్చిపెట్టారు. అతడి బావ అయిన శ్రీనివాస్‌ వారి కుటుంబీకులను అడగడంతో విషయం బయటపడింది.

Similar News

News September 14, 2025

NZB: STU ఏడు మండలాల కార్యవర్గ సభ్యుల ఎన్నిక

image

నిజామాబాద్ జిల్లాలో స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) ఏడు మండలాల కార్యవర్గ సభ్యులను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎడపల్లి మండల అధ్యక్షుడిగా యూసుఫ్, ప్రధాన కార్యదర్శిగా భూపతి ఎన్నికయ్యారు. నవీపేట అధ్యక్షుడిగా రవీందర్, ప్రధాన కార్యదర్శిగా గణేష్ ఎంపికయ్యారు. అదే విధంగా నిజామాబాద్ నార్త్, సౌత్, డిచ్‌పల్లి, ఆలూరు, మోపాల్ మండలాల నూతన అధ్యక్ష, కార్యదర్శులను కూడా ఎన్నుకున్నారు.

News September 14, 2025

జాతీయ మెగా లోక్-అదాలత్ లో 7,444 కేసులలో రాజీ

image

జాతీయ మెగా లోక్-అదాలత్ లో 7,444 కేసులలో రాజీ జరిగిందని NZB CP సాయి చైతన్య జాతీయ మెగా లోక అదాలత్ లో భాగంగా వివిధ కేసులలో రాజీ పడి పరిష్కారం అయినందునకు నిజామాబాద్ జిల్లాకు 4వ స్థానం దక్కిందని, సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన రూ.42,45,273-00ను సైతం తిరిగి సైబర్ బాధితులకు అందజేసినట్లు వివరించారు. జిల్లాను అగ్రగామిగా ఉంచడంలో కృషి చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు.

News September 14, 2025

జాతీయ మెగా లోక్-అదాలత్ లో 7,444 కేసులలో రాజీ

image

జాతీయ మెగా లోక్-అదాలత్ లో 7,444 కేసులలో రాజీ జరిగిందని NZB CP సాయి చైతన్య జాతీయ మెగా లోక అదాలత్ లో భాగంగా వివిధ కేసులలో రాజీ పడి పరిష్కారం అయినందునకు నిజామాబాద్ జిల్లాకు 4వ స్థానం దక్కిందని, సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన రూ.42,45,273-00ను సైతం తిరిగి సైబర్ బాధితులకు అందజేసినట్లు వివరించారు. జిల్లాను అగ్రగామిగా ఉంచడంలో కృషి చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు.