News June 24, 2024

బాపట్ల: సముద్ర తీరాలకు పర్యాటకుల నిలిపివేత

image

బాపట్ల జిల్లా పరిధిలోని సముద్ర తీరాలకు పర్యాటకులను అధికారులు నిలిపివేస్తున్నారు. రెండ్రోజుల్లో ఆరుగురు పర్యాటకులు మృతిచెందడం, పలువురు గల్లంతు అయిన నేపథ్యంలో కొన్నిరోజుల పాటు సముద్రతీరాలకు పర్యాటకులను నిలిపివేయాలని బాపట్ల పోలీస్ శాఖ నిర్ణయించింది. ఇప్పటికే చీరాల, బాపట్ల పరిధిలో ఉన్న తీర ప్రాంతాలకు పర్యాటకులు రావడంతో పోలీసులు వెనక్కి పంపించేస్తున్నారు. పర్యాటకులు గల్లంతు కాకుండా చర్యలు చేపట్టారు.

Similar News

News January 22, 2026

పాన్ ఇండియా ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి: కలెక్టర్

image

బాలకార్మిక వ్యవస్థ నివారణలో భాగంగా ఈ నెల 26 నుంచి మార్చి 31వరకు పాన్ ఇండియా ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం జరిగిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్నీ శాఖలు సమష్టిగా కృషి చేయాలని, బాల్య వివాహాలు అరికట్టాలని స్పష్టం చేశారు.

News January 22, 2026

GNT: ప్రియుడుతో కలిసి భర్తను చంపిన భార్య.. పోలీసుల అదుపులో నిందితులు

image

దుగ్గిరాల(M) చిలువూరులో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటనలో ప్రియురాలు సహా ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మృతుడి భార్య లక్ష్మి మాధురి, ప్రియుడు గోపిలను దుగ్గిరాల ఎస్సై వెంకట రవి విచారిస్తున్నారు. భర్తను చంపిన తర్వాత డెడ్‌బాడీ పక్కన కూర్చొని రాత్రంతా పోర్న్ వీడియోలు చూసినట్లు విచారణలో తేలింది. దిండుతో ఊపిరాడకుండా హత్య చేసి గుండెపోటుతో మరణించాడని నమ్మబలికిన విషయం తెలిసిందే.

News January 22, 2026

గుంటూరు జిల్లాలో 22 రేషన్ షాపులపై కేసులు

image

రేషన్ మాఫియా అక్రమాలను అరికట్టడానికి జిల్లా సివిల్ సప్లై యంత్రాంగం పకడ్బందీగా పని చేస్తోందని ఆ శాఖ జిల్లా అధికారి కోమలి పద్మ తెలిపారు. అక్టోబరు నుంచి జిల్లాలో 22 రేషన్ షాపుల మీద 6A కేసులు, 4 క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారిపై చర్యలకు ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు. అక్రమంగా రవాణా అవుతున్న 763 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, 6A కేసులు 31, క్రిమినల్ కేసులు 28 నమోదు చేశామన్నారు.