News June 24, 2024
తీవ్రత ముగుస్తోంది కానీ యుద్ధం ఆగదు: ఇజ్రాయెల్

గాజాలో తీవ్ర స్థాయి పోరాటం ముగింపు దశకు వస్తోందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. అయితే ఆ భూభాగంపై హమాస్ పట్టు కోల్పోయేవరకు యుద్ధం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. లెబనాన్తో ఉన్న ఉత్తర సరిహద్దు వెంబడి మున్ముందు మరిన్ని బలగాలను మోహరిస్తామని పేర్కొన్నారు. హమాస్ బందీలుగా ఉన్న తమ పౌరులను ఎట్టి పరిస్థితుల్లోనైనా తీసుకొచ్చి తీరతామని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News February 9, 2026
T20 WC: అత్యధిక వికెట్లు తీసింది వీరే..

T20WCలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్(50) తొలి స్థానంలో ఉన్నారు. నిన్న ఐర్లాండ్తో మ్యాచులో 3 వికెట్లు తీసిన హసరంగ(40*) తర్వాతి స్థానంలో ఉన్నారు. అఫ్రీది(39), మలింగ(38), రషీద్(38*), జంపా(36), అజ్మల్(36), సౌథీ(36), నోర్ట్జే(35), మెండిస్(35) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారత్ నుంచి అశ్విన్(32), అర్ష్దీప్(29), బుమ్రా(26) టాప్ వికెట్ టేకర్లుగా ఉన్నారు.
News February 9, 2026
4/800 మార్కులు.. అయినా..

NEET-PG <<18852584>>కటాఫ్<<>>ను ప్రభుత్వం భారీగా తగ్గించడంతో సింగిల్ డిజిట్ మార్కులు వచ్చిన వారికీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు లభిస్తున్నాయి. రోహ్తక్లోని ఓ కాలేజీలో ఆర్థోపెడిక్స్ సీటు 800కిగానూ 4 మార్కులకు, ఢిల్లీలోని టాప్ కాలేజీలో గైనకాలజీ సీటు 44mrksకు దక్కడం గమనార్హం. ఇంత తక్కువ మెరిట్ ఉన్నా సీట్లు ఇవ్వడంపై సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
News February 9, 2026
స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచన

లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు సభ్యులు నిరసన చేపట్టడంతో స్పీకర్ సభను మ.12 గంటలకు వాయిదా వేశారు.


