News June 24, 2024
పార్టీ మార్పుపై MLA సంజయ్ ఏమన్నారంటే?
TG: వ్యక్తిగత అవసరాల కోసం తాను పార్టీ మారలేదని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. నియోజకవర్గానికి నిధుల కేటాయింపు కోసమే కాంగ్రెస్లో చేరినట్లు చెప్పారు. మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించాలని సీఎంను కోరినట్లు తెలిపారు. కొందరు తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాగా నిన్న ఆయనకు సీఎం రేవంత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
Similar News
News October 9, 2024
కేంద్రం బ్యాన్ చేసిన యాప్.. ఎన్నికల సంఘం వాడుతోంది!
కేంద్రం 2020లో 59 చైనా యాప్స్ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. డాక్యుమెంట్లను కెమెరాతో స్కాన్ చేసి పీడీఎఫ్ ఫైల్స్లా సేవ్ చేసుకునేందుకు ఉపకరించే క్యామ్స్కానర్ కూడా వాటిలో ఉంది. దీన్నుంచి కూడా చైనాకు సమాచారం వెళ్తోందన్న ఆరోపణలున్నాయి. అలాంటి ఈ యాప్ను స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘమే వాడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఓ నెటిజన్ ఈ విషయాన్ని గుర్తించి పోస్ట్ పెట్టగా దానిపై చర్చ జరుగుతోంది.
News October 9, 2024
GREAT: 18 ఏళ్లకే ఎత్తైన శిఖరాలన్నీ ఎక్కేశాడు!
నేపాల్కు చెందిన నిమా రింజీ షెర్పా చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో 8వేల మీటర్లకంటే ఎత్తున్న 14 శిఖరాలనూ 18 ఏళ్లకే అధిరోహించారు. బుధవారం ఉదయం టిబెట్లోని 8027 మీటర్ల ఎత్తున్న శీష పంగ్మా పర్వత శిఖరాన్ని చేరుకోవడం ద్వారా ఈ రికార్డును అందుకున్నారు. ఈ పర్వత శిఖరాలను సమీపించేకొద్దీ మనిషికి సరిపడా ఆక్సిజన్ ఉండదు. ఈ నేపథ్యంలో ఈ 14 శిఖరాలను అధిరోహించడాన్ని పర్వతారోహకులు గొప్పగా చెబుతారు.
News October 9, 2024
రోహిత్ వల్లే గెలిచాం.. గంభీర్ను పొగడటం ఆపండి: గవాస్కర్
బంగ్లాదేశ్తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్లో రెండో మ్యాచ్ను భారత్ అద్భుత రీతిలో గెలిచిన సంగతి తెలిసిందే. దానిపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం రోహిత్ కెప్టెన్సీ వల్లే ఆ గెలుపు సాధ్యమైందని తేల్చిచెప్పారు. కొంతమంది ఆ క్రెడిట్ను గంభీర్కు కట్టబెట్టి అతడి బూట్లు నాకుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ వర్గాల్లో ఆయన మాటలు చర్చనీయాంశంగా మారాయి.