News June 24, 2024

రేషన్‌కార్డులు ఉన్న వారికి GOOD NEWS

image

AP: రేషన్ కార్డులు ఉన్న వారికి జులై నుంచి రాగులు పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ తెలిపింది. ప్రస్తుతం రాయలసీమలోని 8 జిల్లాల్లో వీటిని పంపిణీ చేస్తుండగా, మిగతా జిల్లాలకు విస్తరించనుంది. 3KGల బియ్యానికి బదులుగా రాగులు పంపిణీ చేస్తారు. అటు జులై నుంచి శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రేషన్ కార్డుదారులకు జొన్నలు పంపిణీ చేయనున్నారు. రాగులు, జొన్నలు ఇష్టం లేని వారు పూర్తిగా బియ్యం పొందవచ్చు.

Similar News

News November 11, 2025

ప్రకృతి వైపరీత్యాలు సంభవించకూడదంటే?

image

త్రివిధ తాపాల్లో దైవిక తాపం ఒకటి. ఇది ప్రకృతి శక్తుల వలన సంభవిస్తుంది. అధిక వర్షాలు, కరవు, భూకంపాలు, పిడుగులు, తుఫానులు, గ్రహాచారాల వలన కలిగే బాధలు దీని కిందకి వస్తాయి. ఈ దుఃఖాల నుంచి ఉపశమనం పొందడానికి దైవారాధన, భక్తి, ప్రకృతి పట్ల మనం గౌరవం చూపాలి. యజ్ఞాలు, దానాలు, పవిత్ర నదీ స్నానాలు వంటి ధార్మిక కర్మలను ఆచరించాలి. విధిని అంగీకరించాలి. తద్వారా ఈ దైవిక దుఃఖాలను తట్టుకునే మానసిక శక్తి లభిస్తుంది.

News November 11, 2025

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో 9 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్, MTS, లాస్కర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాతపరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://indiancoastguard.gov.in/

News November 11, 2025

పత్తి కాండం, ఆకు, కాయపై నల్ల మచ్చల నివారణ ఎలా?

image

వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాల వల్ల పత్తి మొక్క కాండంపైన, ఆకు, కాయలపై నల్లని మచ్చలు కనిపిస్తాయి. అలాగే కాయ కుళ్లిపోవడం లేదా ఎదగకపోవడం జరుగుతుంటుంది. ఈ సమస్యను గుర్తిస్తే లీటరు నీటికి 2.5గ్రా కార్బండజిమ్+ మాంకోజెబ్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా ప్రొపికొనజోల్ 1మి.లీ. లేదా క్రెసోక్సిమ్ మిథైల్ 1ml లాంటి మందులను మారుస్తూ 1 లేదా 2 సార్లు 10 నుంచి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.