News June 24, 2024
ఆ యాప్స్తో క్రెడిట్ బిల్లుల చెల్లింపులు నిలిచిపోనున్నాయా?
క్రెడ్, ఫోన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్తో జులై 1 నుంచి క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులు నిలిచిపోయే అవకాశముంది. చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ నుంచే జరగాలన్న RBI రూలే ఇందుకు కారణం. ఈ సిస్టమ్ను SBIతో సహా 8బ్యాంకులు యాక్టివేట్ చేసుకోగా HDFC, ICICI, AXIS వంటి బ్యాంకులు ఇంకా యాక్టివేట్ చేసుకోలేదు. దీంతో ఆ యాప్స్లో బిల్లులు చెల్లించలేరు. అయితే Bank వెబ్సైట్, APPతో చెల్లింపులు జరపొచ్చు.
Similar News
News October 10, 2024
రతన్ టాటా మృతి పట్ల కేంద్రమంత్రులు, రాహుల్ సంతాపం
దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా మృతి పట్ల కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, అమిత్ షా, పియూష్ గోయల్ సంతాపం తెలియజేశారు. ఇండియా ఇండస్ట్రీకి రతన్ టాటా టైటాన్ అని రాజ్నాథ్ ట్వీట్ చేశారు. టాటా నిజమైన దేశభక్తుడని అమిత్ షా పేర్కొన్నారు. పరిశ్రమలకు రతన్ చేసిన కృషి మన దేశంతో పాటు ప్రపంచంపై చెరగని ముద్ర వేసిందని నడ్డా తెలిపారు. రతన్ కుటుంబానికి, టాటా కమ్యూనిటీకి రాహుల్ గాంధీ సంతాపం తెలియజేశారు.
News October 10, 2024
ప్రిడేటర్ డ్రోన్స్, అణు సబ్మెరైన్ల కొనుగోలుకు సీసీఎస్ ఆమోదం
రెండు అణు జలాంతర్గాముల నిర్మాణంతో పాటు 31 ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు PM మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(CCS) ఆమోదం తెలిపింది. సబ్మెరైన్లను రూ.40వేల కోట్లతో వైజాగ్లో నిర్మించనున్నారు. USకు చెందిన జనరల్ అటామిక్స్ సంస్థ నుంచి డ్రోన్లను కొనుగోలు చేస్తారు. ఇవి వచ్చే నాలుగేళ్లలో దశలవారీగా భారత్ చేతికి అందుతాయి. అందులో నేవీకి 15, ఆర్మీ, వాయుసేనకు చెరో 8 డ్రోన్లు కేటాయించారు.
News October 10, 2024
అక్టోబర్ 10: చరిత్రలో ఈ రోజు
1906: రచయిత R.K.నారాయణ్ జననం
1967: హాస్య నటుడు ఆలీ జననం
1973: దర్శకుడు రాజమౌళి జననం
1990: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జననం
2022: సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణం
✶ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం