News June 24, 2024
ఒకే రోజు మూడు రికార్డులు బ్రేక్

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఒకే రోజు మూడు రికార్డులు బ్రేక్ చేశారు. ఇవాళ ఆస్ట్రేలియాపై ఊచకోతతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు(4,165) చేసిన ఆటగాడిగా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో బాబర్(4,145), కోహ్లీ (4,103) ఉన్నారు. దీంతో పాటు అంతర్జాతీయ క్రికెట్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సిక్సర్లు(132vsAUS) బాదిన ప్లేయర్గా నిలిచారు. T20Iల్లో 200 సిక్సర్లు బాదిన మొదటి ఆటగాడిగానూ రోహిత్ చరిత్ర సృష్టించారు.
Similar News
News April 10, 2026
ఇజ్రాయెల్ ఫైర్.. పోస్ట్ డిలీట్ చేసిన పాక్ మంత్రి

ఇజ్రాయెల్ ‘మానవాళికి శాపం’ అని, లెబనాన్లో ‘నరమేధం’ సృష్టిస్తోందంటూ పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆఫీస్ తీవ్రంగా స్పందించింది. శాంతి చర్చల్లో మధ్యవర్తిగా ఉంటూ ఇజ్రాయెల్ అంతాన్ని కోరడం ఏంటని మండిపడింది. ఇలాంటి వ్యాఖ్యలను అస్సలు సహించబోమని గట్టిగా హెచ్చరించింది. దీంతో దిగొచ్చిన ఖవాజా తన ‘X’ పోస్ట్ను వెంటనే డిలీట్ చేశారు.
News April 10, 2026
పాడి పశువులకు టీకాలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వాతావరణ మార్పుల కారణంగా పశువులకు కొన్ని బాక్టీరియా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పశువులకు ఆయా సీజన్లకు అనుగుణంగా టీకాలు వేయించాలి. ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ☛ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు(ఉదయం, సాయంత్రం) మాత్రమే టీకాలు వేయించాలి. ☛ వ్యాధి సోకిన పశువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ టీకాలు వేయించకూడదు. ☛ ఒక టీకా వేసిన 10-15 రోజుల తర్వాత మాత్రమే ఇంకో టీకా వేయించాలి.
News April 10, 2026
పంటల్లో ఎర్రనల్లిని ఎలా నివారించాలి?

ఎర్రనల్లి పురుగు వల్ల పంటలకు చాలా నష్టం జరుగుతుంది. ఎరుపు రంగు శరీరంతో ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా పెరుగుతూ ఆకుల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులోని పత్రహరితం తగ్గిపోయి ఆకులపై తెలుపు, పసుపు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పాలిపోయి మొక్కలపై బూడిద చల్లినట్లు కళావిహీనంగా కనిపిస్తాయి. ఎర్రనల్లి నివారణకు లీటరు నీటికి డైకోఫాల్ 5ml లేదా అబామెక్టిన్ 0.5ml కలిపి పిచికారీ చేయాలి.


